మహాకుంభ్ 2025: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

Published : Jan 08, 2025, 10:30 PM IST
మహాకుంభ్ 2025: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

సారాంశం

మహాకుంభ్ 2025 కోసం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సంగం ఘాట్, పాంటూన్ వంతెనలపై తనిఖీలు ముమ్మరం చేశారు. అధికారులు భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.

మహాకుంభ్ నగర్. మహాకుంభ్ 2025 ను సజావుగా నిర్వహించడానికి పోలీసులు సిద్దమయ్యాారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ వైభవ్ కృష్ణ (IPS) ఆదేశాల మేరకు ప్రధాన స్నాన పర్వం ముందు రాత్రి నుండి కట్టుదిట్టమైన తనిఖీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగం ఘాట్, పాంటూన్ వంతెనలు,ఇతర కూడళ్ల వద్ద అనుమానితులపై నిఘా పెట్టారు.

పోలీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అన్ని స్టేషన్ల ఇన్చార్జిలకు తమ పరిధిలో అప్రమత్తంగా ఉండి, నిఘా పెంచాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

అదనపు పోలీస్ సూపరింటెండెంట్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ ఇన్చార్జిలు తమ బృందాలతో కలిసి అనుమానితులు, వాహనాల తనిఖీలు నిర్వహించారు. పాంటూన్ వంతెనలపై భద్రతను మరింత పటిష్టం చేశారు.

రాబోయే స్నాన పర్వం దృష్ట్యా పోలీసులు భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేస్తున్నారు. అన్ని స్టేషన్లలో భద్రతా బలగాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మహాకుంభ్-2025 శాంతియుతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?