వాజ్ పేయి ఫోటోతో రూ.100 నాణెం విడుదల

Published : Dec 24, 2018, 12:27 PM ISTUpdated : Dec 24, 2018, 12:56 PM IST
వాజ్ పేయి ఫోటోతో రూ.100 నాణెం విడుదల

సారాంశం

ఈ ఏడాది ఆగస్టులో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన గౌరవార్ధం వాజ్ పేయీ ఫోటోతో ఈ రూ.100 నాణేన్ని తయారు చేశారు. 

భారత ప్రధాని నరేంద్రమోదీ సోమవారం.. రూ.100 నాణేన్ని విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టులో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన గౌరవార్ధం వాజ్ పేయి ఫోటోతో ఈ రూ.100 నాణేన్ని తయారు చేశారు. ఆ నాణేన్ని మోదీ ఈ రోజు విడుదల చేశారు. వాజ్ పేయి జయంతోత్సవానికి ఒక రోజు ముందు ఈ నాణేలను ప్రభుత్వం విడుదల చేయడం విశేషం.

వాజ్ పేయీ జయంతిని బీజేపీ సుపరిపాలన రోజుగా వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ నాణేం విడుదల కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వాని, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఇండోనేషియా పార్లమెంట్ లో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | Modi Indonesia Tour
ఇండోనేషియాలో అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ | PM Modi Indonesia Visit | Bintang Adipurna Honour