PM Modi: నేపాల్ ప్రధానితో కలిసి మహామాయా దేవి ఆలయంలో ప్రధాని మోడీ ప్రార్థ‌న‌లు

By Mahesh RajamoniFirst Published May 16, 2022, 1:35 PM IST
Highlights

PM Narendra Modi: మహామాయా దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత, లుంబినీ డెవలప్‌మెంట్ ట్రస్ట్ నిర్వహించిన బుద్ధ జయంతి వేడుక‌ల నేప‌థ్యంలో నిర్వ‌హించిన బహిరంగ సభలో ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రసంగించారు.
 

PM Modi in Nepal: నేపాల్ ప్ర‌ధాని షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు నేపాల్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినీలో ఒక రోజు పర్యటన కొన‌సాగుతోంది. 'నేపాల్‌లోని అద్భుతమైన ప్రజలలో ఉన్నందుకు సంతోషంగా ఉంది' అని లుంబినీకి చేరుకున్న క్ర‌మంలో పీఎం మోడీ అన్నారు.మహామాయా దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత, లుంబినీ డెవలప్‌మెంట్ ట్రస్ట్ నిర్వహించిన బుద్ధ జయంతి వేడుక‌ల నేప‌థ్యంలో నిర్వ‌హించిన బహిరంగ సభలో ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రసంగించారు.  సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీ విమానం దిగింది. ఆయనతో పాటు ఆయన ప్రతినిధి బృందం సభ్యులు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో నేపాల్‌లోని లుంబినీ చేరుకున్నారు. ఇక్కడ ఆయన మహామాయా దేవి ఆలయంలో ప్రార్థనలు చేశారు.

ఒక‌ ఒకరోజు పర్యటనలో, ప్రధాని న‌రేంద్ర మోడీ.. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో జలవిద్యుత్, అభివృద్ధి మరియు కనెక్టివిటీతో సహా వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించే అంశాల‌పై వివరణాత్మక చర్చలు జరుపుతారు. లుంబినీ నేపాల్‌లోని టెరాయ్ మైదానంలో ఉంది. ఇది బౌద్ధమతం పవిత్ర స్థలాలలో ఒకటిగా పేరుగాంచింది. మహామాయా దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత , బుద్ధ జయంతి సందర్భంగా జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. నేపాల్ ప్రభుత్వ సహకారంతో లుంబినీ డెవలప్‌మెంట్ ట్రస్ట్ దీన్ని నిర్వహించింది. లుంబినీ బౌద్ధ విహార ప్రాంతంలో బౌద్ధ సంస్కృతి మరియు వారసత్వ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా ప్రధాని మోడీ పాల్గొంటారు.

అంతర్జాతీయ బౌద్ధ సంస్కృతి మరియు వారసత్వ కేంద్రం.. లుంబినీ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌తో కలిసి భారతదేశంలోని అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ద్వారా ప్రపంచ విజ్ఞప్తితో నిర్మించబడుతోంది. దీని కోసం భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య అనేది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ బాడీ. ఈ బౌద్ధ కేంద్రం నేపాల్‌లో మొదటి జీరో కార్బన్ ఎమిషన్ భవనం అవుతుంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ మరియు దేవుబాలు ఇద్ద‌రు లుంబినీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, "ఈ సమావేశంలో, ఇద్దరు నాయకులు నేపాల్-భారత్ సహకారం మరియు పరస్పర ప్రయోజనాలపై అభిప్రాయాలను పంచుకుంటారు" అని పేర్కొంది. 

తన పర్యటనకు ముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో, గత నెలలో దేవుబా భారతదేశ పర్యటన సందర్భంగా ఫలవంతమైన చర్చల తర్వాత నేపాల్ ప్రధానిని మళ్లీ కలవడానికి తాను ఎదురు చూస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. జలవిద్యుత్, అభివృద్ధి, కనెక్టివిటీ సహా పలు రంగాల్లో ఇరుపక్షాల మధ్య ఉమ్మడి అవగాహన కొనసాగుతుందని ఆయన చెప్పారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి ఖుషీనగర్‌కు చేరుకుంటారు. ఆయన ఇక్కడ ఉన్న బుద్ధ భగవానుడి మహాపరినిర్వాణ స్థూపాన్ని సందర్శించి దర్శనం చేసి ప్రార్థనలు చేస్తారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ నేపాల్‌కు వెళ్లడం ఇది 5వసారి. 

PM Narendra Modi and Nepal PM Sher Bahadur Deuba offer prayers at Mahamayadevi Temple in Lumbini, Nepal

(Source: DD) pic.twitter.com/EAfgQ2cAz2

— ANI (@ANI)
click me!