భారత పార్లమెంటరీ ప్రయాణంలో గోల్డెన్ మూమెంట్.. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై మోదీ..

Published : Sep 21, 2023, 12:40 PM IST
భారత పార్లమెంటరీ ప్రయాణంలో గోల్డెన్ మూమెంట్.. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై మోదీ..

సారాంశం

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడంపై  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సభ్యులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ అధినియం)కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడంపై  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సభ్యులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ.. లోక్‌సభలో మెజారిటీతో బిల్లు ఆమోదం పొందడం భారతదేశ పార్లమెంటరీ ప్రయాణంలో ఒక బంగారు క్షణం అని అన్నారు. పార్లమెంటు చరిత్రలో ఈ సువర్ణ క్షణానికి అన్ని రాజకీయ పార్టీల సభ్యులు కూడా అర్హులు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

‘‘నిన్న భారతదేశ పార్లమెంటరీ ప్రయాణంలో ఒక బంగారు క్షణం. ఈ సభలోని సభ్యులందరూ ఆ బంగారు క్షణానికి అర్హులు.. నిన్నటి నిర్ణయం, నేడు మనం రాజ్యసభ (ఈరోజు బిల్లు ఆమోదం) తర్వాత చివరి మైలు దాటినప్పుడు.. దేశం మహిళా శక్తి ముఖంలో పరివర్తన, ఏర్పడబోయే విశ్వాసం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అనూహ్యమైన, అపూర్వమైన శక్తిగా ఉద్భవిస్తుంది. నేను దీనిని అనుభూతి చెందగలను’’ అని ఈరోజు ఉదయం ప్రధాని మోదీ లోక్‌సభలో పేర్కొన్నారు. 

 


మరోవైపు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈరోజు నారీ శక్తి వందన్ అధినియమ్‌ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఈరోజు ఈ బిల్లుపై ఓటింగ్ జరగనుంది.  

PREV
click me!

Recommended Stories

Mahindra Scorpio N : భారీ మార్పులతో స్కార్పియో వచ్చేస్తోంది.. ధర ఎంతో తెలుసా..?
Lactobacillus Bulgaricus: బ్యాక్టీరియా కూడా రాష్ట్ర గుర్తేనా? కేరళ రికార్డ్ | Asianet News Telugu