Fact Check: ఫైటర్ జెట్లపై భారత ఆర్మీ చీఫ్ నిజంగానే ఆ కామెంట్స్ చేశారా? PIB క్లారిటీ

Published : Aug 12, 2025, 09:22 PM IST
PIB Confirms Upendra Dwivedi Video Is Deepfake

సారాంశం

Fact Check: ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. అయితే, ఆ వీడియో నిజమైంది కాదనీ, డీప్‌ఫేక్స్ వల్ల తప్పుడు సమాచారం పెరుగుతోందని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.

DID YOU KNOW ?
డీప్‌ఫేక్ ప్రమాదం
డీప్‌ఫేక్ AI సాయంతో వ్యక్తుల రూపం, వాయిస్ మార్చి తప్పుడు కంటెంట్ సృష్టించే సాంకేతికత. ఇది రాజకీయ, సైనిక, సెలబ్రిటీలపై వాడకం పెరిగింది.

Fact Check: సోషల్ మీడియాలో భారత ఆర్మీకి చెందిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ వీడియోలో.. పాకిస్తాన్‌తో యుద్ధంలో ఇండియా ఆరు ఫైటర్ జెట్‌లు, 250 మంది సైనికులను కోల్పోయిందని ఒప్పుకున్నట్లుగా ఉంది. కెమెరా ముందు నేరుగా మాట్లాడుతున్నట్లు ఆర్మీ చీఫ్ కనిపిస్తున్నారు. అయితే, ఫ్యాక్ట్ చెక్ లో ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని గుర్తించారు. 

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ (PIB ఫ్యాక్ట్ చెక్) యూనిట్ ఈ క్లిప్ AI ద్వారా సృష్టించారనీ, జనరల్ ఉపేంద్ర ద్వివేది అలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని కన్ఫర్మ్ చేసింది. ఆరు ఎయిర్‌క్రాఫ్ట్ లేదా 250 మంది సిబ్బంది నష్టం గురించి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. డీప్‌ఫేక్స్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వీడియోను డిజిటల్‌గా మార్చారు. నమ్మకమైన మీడియా లేదా అధికారిక డిఫెన్స్ కమ్యూనికేషన్ కూడా ఇలాంటి నష్టాలను రిపోర్ట్ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది.

 

 

ఆందోళనలు పెంచుతున్న డీప్ ఫేక్

డీప్ ఫేక్ బారిన ఇప్పటికే చాలా మంది పడ్డారు. ముఖ్యంగా జాతీయ భద్రత వంటి సున్నితమైన అంశాల చుట్టూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి డీప్‌ఫేక్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అనవసర భయాందోళనలకు దారితీయవచ్చు.

డీప్‌ఫేక్‌ను ఎలా గుర్తించాలి 

  • అసహజ ముఖ కదలికలు లేదా లిప్-సింక్ సరిపోలడం లేని వీడియోలు.
  • నమ్మడానికి లేదా షేర్ చేయడానికి ముందు నమ్మకమైన, అధికారిక వనరులతో వార్తలను క్రాస్-చెక్ చేయండి.
  • ప్రముఖ మీడియా సంస్థల కవరేజ్ లేని సంచలనాత్మక వార్తల పట్ల జాగ్రత్తగా ఉండండి.

ఇలాంటి సంచలనాత్మక వార్తలను ఆన్‌లైన్‌లో షేర్ చేసే ముందు అధికారిక ఛానెల్స్ ద్వారా వెరిఫై చేసుకోవాలని PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ పౌరులను కోరింది. ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఉండవచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu