ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం

Published : Jan 12, 2020, 07:48 AM ISTUpdated : Jan 12, 2020, 07:53 AM IST
ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం

సారాంశం

మహారాష్ట్రలో ఓ ఫ్యాక్టరీలో  ఘోర ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. 

ముంబై: మహారాష్ట్రలో ఓ ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా ఈ ప్రమాదం వాటిల్లింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లా బాయిసర్ లోని ఓ ఫ్యాక్టరీలో శనివారం రాత్రి పేలుడు సంభవించింది ఈ పేలుడులో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ పేలుడు ధాటికి సమీపంలోని కొన్ని ఇళ్ల కిటికీలు కూడా దెబ్బతిన్నాయి.

ఓ కెమికల్ ఫ్యాక్టరీలో కొత్త  కొత్త రియాక్టర్‌ను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ పైటర్లు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. 

 ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 5లక్షల పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు సహాయక చర్యలు ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు 

PREV
click me!

Recommended Stories

Holidays : తెలంగాణ ఉద్యోగులకు బంపరాఫర్... ఏప్రిల్ 23, 29 రెండ్రోజులు సెలవే..!
ఇదెక్క‌డి మాస్‌రా మామా.! కేఎఫ్ స్ట్రాంగ్ రూ. 110, బడ్వైజ‌ర్ ప్రీమియం రూ. 130 మాత్ర‌మే