లవర్ కోసం పాకిస్థాన్ వెళ్లిన అంజు.. వచ్చే నెలలో భారత్ కు.. ఎందుకంటే..? 

Published : Sep 18, 2023, 06:36 AM IST
లవర్ కోసం పాకిస్థాన్ వెళ్లిన అంజు.. వచ్చే నెలలో భారత్ కు.. ఎందుకంటే..? 

సారాంశం

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా భివాడి నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిన అంజు.. ఇప్పుడు భారత్‌కు తిరిగి రానుంది. ప్రేమ కోసం సరిహద్దులు దాటిన అంజు.. తన పిల్లలను కలవడానికి ఇండియా వస్తుంది. వచ్చే నెలలో అంజు భారత్‌కు తిరిగి రావచ్చని ఆమె పాకిస్థాన్ భర్త ఆదివారం తెలిపారు.  

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు (Pakistan) వెళ్లిన భారతీయ మహిళ అంజు (34)..ఇప్పుడు భారత్ కు తిరిగి రానుంది. జూలై 25న ఇస్లాంలోకి మారిన తర్వాత అంజు తన 29 ఏళ్ల స్నేహితురాలు నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. అతని కలిసి  ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని అప్పర్ దిర్ జిల్లాలో ఉంటుంది. 2019లో ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారు. అంజు పేరు ఇప్పుడు ఫాతిమాగా మారింది. కాగా.. భారతీయ మహిళ అంజు తన పిల్లలను కలవడానికి వచ్చే నెలలో పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆమె పాకిస్థాన్ భర్త ఆదివారం తెలిపారు.  

ఫాతిమా మానసిక ఆరోగ్యం క్షీణించడం తనకు ఇష్టం లేదని నస్రుల్లా చెప్పారు. ఆమె తన పిల్లలను కలవడానికి భారత్ కు వెళ్ళడమే మంచిది. పాకిస్థాన్‌లో డాక్యుమెంటరీ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత అంజు తిరిగి భారత్ కు వస్తుంది. వీసా రాగానే ఇండియాకు రానున్నదని తెలిపారు. 

ఫాతిమా (అంజు) వచ్చే నెలలో భారతదేశానికి తిరిగి వస్తోందని అంజు భర్త నస్రుల్లా చెప్పాడు. ఆమె మానసిక క్షోభకు గురైంది. అంజు తన పిల్లలను మిస్సవుతుందని , వెనక్కి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని ఆమె భావిస్తున్నారని ఆమె పాకిస్థాన్ భర్త తెలిపారు. అంజు మొదటి వివాహం రాజస్థాన్ నివాసి అరవింద్‌తో అయ్యింది. వీరికి  15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.

ఈ ఏడాది ఆగస్టులో పెళ్లి తర్వాత అంజు, ఆమె భర్త పెషావర్‌లో ఉన్నారు. ఈ సమయంలో పెషావర్‌లోని దివంగత దిలీప్ కుమార్ , షారుక్ ఖాన్ వంటి ప్రముఖ భారతీయ సినీ నటుల పూర్వీకుల ఇళ్లను సందర్శించాలని అంజు తన కోరికను వ్యక్తం చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?