నితీష్, మమతలే బాధ్యులు : బీహార్-బెంగాల్ హింసపై ఒవైసీ ఆగ్రహం

Published : Apr 04, 2023, 05:18 PM IST
నితీష్, మమతలే బాధ్యులు : బీహార్-బెంగాల్ హింసపై ఒవైసీ ఆగ్రహం

సారాంశం

బీహార్ హింసాకాండపై నితీష్ ప్రభుత్వంపై ఏఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఈ హింసాకాండను రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా, నిర్వాహకుల బాధ్యతగా ఒవైసీ అభివర్ణించారు.

హింసాకాండపై ఒవైసీ స్పందన: రామనవమి ఊరేగింపు సందర్భంగా బీహార్‌,  బెంగాల్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రాజకీయాల్లో తీవ్ర యుద్ధం జరుగుతోంది. మార్చి 30న ఇరువర్గాల మధ్య మొదలైన ఘర్షణ ఇప్పటి వరకు చర్చనీయాంశంగానే ఉంది. ఈ ఘటనపై బీహార్ లోని నితీష్ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

గత కొన్ని రోజులుగా బీహార్ ప్రభుత్వాన్ని బీజేపీ ఇరుకున పెడుతుండగా.. తాజాగా  ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా నితీష్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. బీహార్ ,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పదేపదే జరిగిన హింసాత్మక సంఘటనలకు రెండు ప్రభుత్వాలను బాధ్యులను చేశారు. కాల్పులను అరికట్టడంలో రాష్ట్రాలు నిరంతరం విఫలమవుతున్నాయని ఒవైసీ దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో హింస జరిగితే..  దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. బీహార్‌లో 100 ఏళ్ల మదర్సాను తగులబెట్టి, మసీదు కూల్చివేతకు పాల్పడ్డారని, ఇది ప్రభుత్వ వైఫల్యమని ఒవైసీ అన్నారు. ఈ ఘటన 2016లో జరిగింది.

నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌లు రాష్ట్రంలోని ముస్లింలలో భయాన్ని పెంచుతున్నారని ఆరోపిస్తూ.. "ఆయనకు పశ్చాత్తాపం లేదు, అతను నిన్న ఇఫ్తార్‌కు కూడా హాజరయ్యాడు. సిఎం నితీష్, తేజస్వి రాష్ట్రంలోని ముస్లింలలో భయాన్ని కలిగించాలనుకుంటున్నారు." ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఓవైసీ అన్నారు.  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమైనా లేదా బీహార్ ప్రభుత్వమైనా.. ఇది రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం. కర్ణాటకలో ఇద్రీస్ పాషాపై మూక హత్యలు జరిగినా. ప్రభుత్వం ఏమి చేస్తోంది?" ప్రశ్నించారు.  ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింసాకాండపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా విరుచుకుపడ్డారు. మమత నిద్రపోతుందా అని నిలదీశారు.

చైనా విషయంలో ప్రధాని మోదీపై టెన్షన్

చైనా గురించి ఒవైసీ మాట్లాడుతూ - ప్రధాని మోడీ చైనాపై మాట్లాడరు, చైనా భారత దేశ వర్తమానాన్ని చెరిపివేస్తుంటే..  మీరు(బీజేపీ) చరిత్రను చెరిపివేస్తున్నారని విమర్శించారు. మొఘలుల చరిత్రను ఎన్‌సీఈఆర్‌టీ నుంచి తొలగించడంపై ఈ వ్యాఖ్యలు చేశారు.  2024లో మోడీని ఓడించాలంటే..  540లో 540 మందిని నిలబెట్టాలని అన్నారు.  రాహుల్ గాంధీ దేశ సమస్య కాదని, రాహుల్ తనతో పోటీ పడాలని మోడీ కోరుకుంటున్నారని, చైనాతో పోటీ పడాలని నిరుద్యోగం కోరుకుంటున్నామని AIMIM చీఫ్ అన్నారు.  ప్రధాని హైదరాబాద్ పర్యటన గురించి మాట్లాడుతూ.. ఆయన వస్తున్నారని, కాబట్టి తమ నియోజకవర్గంలో మెట్రోకు డబ్బులు ఇవ్వాలని కోరుతున్నామనీ,  ఎయిర్‌పోర్ట్ మెట్రోకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu