Operation Kanak 2: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అక్ర‌మాలు.. 30 చోట్ల సీబీఐ దాడులు

Published : Feb 21, 2023, 03:27 PM IST
Operation Kanak 2: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అక్ర‌మాలు.. 30 చోట్ల సీబీఐ దాడులు

సారాంశం

Operation Kanak 2: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) అవినీతి కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పంజాబ్ లోని వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులకు సంబంధించిన 30 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. జనవరిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జరిగిన అవినీతిపై సీబీఐ 'ఆపరేషన్ కనక్'ను ప్రారంభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

Corruption in Food Corporation of India: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) అవినీతి కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పంజాబ్ లోని వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులకు సంబంధించిన 30 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. ఈ క్ర‌మంలోనే ప‌లు కీల‌క ప‌త్రాలు స్వాధీనం కేసుకున్న‌ద‌ని స‌మాచారం. 

వివ‌రాల్లోకెళ్తే.. వ్యాపారులు, రైస్ మిల్లర్లకు లబ్ధి చేకూర్చేలా నాసిరకం ధాన్యాన్ని కొనుగోలు చేసిన భారత ఆహార సంస్థ (ఎఫ్ సీఐ) అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా పంజాబ్ లోని 30 ప్రాంతాల్లో సీబీఐ మంగళవారం సోదాలు నిర్వహించింది. 'ఆపరేషన్ కనక్ 2'లో భాగంగా పంజాబ్ లోని సిర్హింద్, ఫతేపూర్ సాహిబ్, మోంగా సహా పలు జిల్లాల్లో ధాన్యం వ్యాపారులు, రైస్ మిల్లు యజమానులు, ఎఫ్ సీఐకి చెందిన సర్వీస్, రిటైర్డ్ అధికారుల నివాసాల్లో సీబీఐ బృందాలు సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి.

ఎఫ్ సీఐ గోడౌన్లలో లోడ్ చేసిన ట్రక్కుకు ప్ర‌యివేటు మిల్లర్ల నుంచి రూ.1,000-4,000 లంచం తీసుకుంటూ, వారు సరఫరా చేసిన నాసిరకం ధాన్యాన్ని, ఇతర ప్రయోజనాలను కప్పిపుచ్చుకునేందుకు ఎఫ్ సీఐ అధికారుల వ్యవస్థీకృత సిండికేట్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో భాగంగా జ‌రిగిన రెండో దఫా సోదాలు ఇవి. ఈ లంచాలను హెడ్ క్వార్టర్స్ వరకు ప్రతి స్థాయి అధికారులకు నిర్ణీత శాతం కోతల్లో పంపిణీ చేశారని ఆరోపించింది. పంజాబ్ లోని పలు ఎఫ్ సీఐ డిపోల్లో ఇలాంటి లంచం వసూలు వివరాలను ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. టెక్నికల్ అసిస్టెంట్ల నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వరకు ప్ర‌యివేటు మిల్లర్ల నుంచి లంచాలు తీసుకునే సిండికేట్ లో భాగస్వాములయ్యారని ఆరోపించారు.

ధాన్యాన్ని నిల్వ చేసే సమయంలో ఎఫ్ సీఐ డిపోలో అన్ లోడ్ చేసే ప్రతి ట్రక్కు ఆధారంగా ఎఫ్ సీఐ అధికారులు డిపో స్థాయిలో లంచం మొత్తాన్ని వసూలు చేస్తారు. ఆ తర్వాత ఈ లంచం మొత్తాన్ని ఎఫ్ సీఐ లోని  వివిధ ర్యాంకులకు పంచుతున్నారని సీబీఐ ఆరోపించింది. కాగా, జనవరిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జరిగిన అవినీతిపై సీబీఐ 'ఆపరేషన్ కనక్'ను ప్రారంభించిందనీ, చండీగఢ్ లో డీజీఎం స్థాయి అధికారిని అరెస్టు చేసిన తర్వాత పంజాబ్, హర్యానా, ఢిల్లీలోని 50 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిందని పీటీఐ నివేదిక తెలిపింది.

అధికారులు, రైస్ మిల్లు యజమానులు, దళారుల సిండికేట్ లో అవినీతికి పాల్పడుతున్న అనుమానితులను గుర్తించేందుకు ఆరు నెలల పాటు రహస్యంగా నిర్వహించిన ఆపరేషన్ అనంతరం ఎఫ్ సీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదీప్ సింగ్ సహా మొత్తం 74 మందిపై ఎఫ్ ఐఆర్ లో సీబీఐ కేసు నమోదు చేసింది. ప్ర‌యివేటు  గోసులోని ఆపరేటర్లకు లబ్ధి చేకూర్చేందుకు ఎఫ్ సీఐ అధికారులకు భారీ లంచం ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.

 

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu