Odisha Train Tragedy: మృతదేహాలు ఉంచిన స్కూల్ కూల్చేసిన అధికారులు.. ఎందుకంటే?

Published : Jun 09, 2023, 09:26 PM ISTUpdated : Jun 09, 2023, 09:42 PM IST
Odisha Train Tragedy: మృతదేహాలు ఉంచిన స్కూల్ కూల్చేసిన అధికారులు.. ఎందుకంటే?

సారాంశం

ఒడిశా రైలు దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాలు సమీపంలోని బహనాగ ప్రభుత్వ హాస్పిటల్‌లో తాత్కాలికంగా ఉంచారు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీలను భువనేశ్వర్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ భారీ మొత్తంలో శవాలను స్కూల్‌లో చూసిన స్థానికులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపించబోమని చెప్పారు. దీంతో అధికారులు శుక్రవారం ఆ భవనాన్ని కూల్చేశారు.  

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో సుమారు 288 మంది మరణించారు. ఈ ఘటన  దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా ప్రజలకు ఇప్పటికీ ఇది పీడకలగా వెంటాడుతూనే ఉన్నది. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను అధికారులు తాత్కాలికంగా సమీపంలోని బహనాగ ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. ఆ తర్వాత డెడ్ బాడీలను భువనేశ్వర్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ ప్రభుత్వ పాఠశాలను శుభ్రం చేసి మళ్లీ పిల్లలు చదువుకోవడానికి సిద్ధం చేసి పెట్టారు.

అయితే, భారీ మొత్తంలో శవాలను చూసిన స్థానికులు కొన్ని రోజుల వరకు షాక్‌లోనే ఉండిపోయారు. ఆ డెడ్ బాడీలు తమ ఊరి ప్రభుత్వ పాఠశాలలో చూసి ఖంగుతిన్నారు. కుప్పలుగా ఉంచిన శవాల దృశ్యాలు ఇప్పటికీ వారిని వెంటాడుతున్నాయి. అయితే, ఈ నెల 16వ తేదీన మళ్లీ స్కూల్ ప్రారంభం కానుంది. చిన్న పిల్లలు మళ్లీ ఈ స్కూల్ వెళ్లాల్సి ఉన్నది.

Also Read: బెల్లంపల్లి ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై యువతి ఎన్‌సీడబ్ల్యులో ఫిర్యాదు: విచారణకు ఆదేశం

కానీ, ఆ శవాల దృశ్యాలు చూసిన స్థానికులు ఆ బడి వైపు చూడాలంటే బెంబేలెత్తిపోతున్నారు. పిల్లలూ అంతే. ఆ స్కూల్‌కు పిల్లలను పంపబోమని, పిల్లలూ భయపడుతున్నారని స్థానికులు తమ భయాలను బయటపెట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూల్‌కు పంపించబోమని చెబుతున్నారని హెడ్ మాస్టర్ ప్రమీలా స్వేన్ తెలిపారు. అలాగే.. సుమారు 6 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ స్కూల్ భవనం కూడా దెబ్బతిన్నదని వివరించారు. ఈ స్కూల్ భవనాన్ని కూల్చి నూతనంగా భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ స్కూల్ అధికారులు కోరారు.

దీంతో బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ షిండే బహనాగ స్కూల్‌కు గురువారం వెళ్లి పరిశీలించారు. ఆ తర్వాత ఆ స్కూల్ భవనం కూల్చివేతకు అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతులు వచ్చిన తర్వాత శుక్రవారం భవనాన్ని కూల్చేశారు. అదే ప్రదేశంలో నూతన భవనాన్ని అధికారులు నిర్మించనున్నారు. 

నూతన భవనం నిర్మాణమయ్యాక పిల్లలు ఎలాంటి భయాలు లేకుండా స్కూల్‌కు వస్తారని ఉపాధ్యాయులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu