NSA Doval: దేశ పురోగమనంలో కొన్ని దుష్ట‌శ‌క్తులు అడ్డుప‌డుతున్నాయి: అజిత్ దోవల్

Published : Jul 30, 2022, 06:02 PM IST
NSA Doval: దేశ పురోగమనంలో కొన్ని దుష్ట‌శ‌క్తులు అడ్డుప‌డుతున్నాయి: అజిత్ దోవల్

సారాంశం

NSA Doval: దేశ పురోగమనంలో ప్రతి మతం స‌హక‌రించాల‌నీ, భారతదేశ‌ పురోగతికి ఆటంకం కలిగించే వాతావరణాన్ని సృష్టించేందుకు కొన్ని దుష్ట‌ శ‌క్తులు  ప్రయత్నిస్తున్నాయని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ పేర్కొన్నారు. 

NSA Doval: భారతదేశ‌ పురోగతికి ఆటంకం కలిగించే వాతావరణాన్ని సృష్టించేందుకు కొన్ని దుష్ట‌ శ‌క్తులు  ప్రయత్నిస్తున్నాయని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ పేర్కొన్నారు. అజిత్ దోవల్ శనివారం సర్వమత సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో పలు మతాలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు. స‌మాజంలో కొన్ని దుష్ట‌శ‌క్తులు.. మతం, భావజాలం పేరుతో సంఘర్షణను సృష్టిస్తున్నాయ‌నీ, ఇది మొత్తం దేశాన్ని ప్రభావితం చేస్తుంద‌ని అజిత్ దోవల్ అన్నారు. 

దేశం వెలుపల కూడా విస్తరిస్తోందనీ, ప్రపంచంలో సంఘర్షణ వాతావరణం నెలకొని ఉందని, ఆ వాతావరణాన్ని మనం ఎదుర్కోవాలంటే దేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న విధానం, అన్ని మతాల ప్రజలు దాని నుండి ప్రయోజనం పొందుతారని అజిత్ దోవల్ అన్నారు. 

నసీరుద్దీన్ చిస్తీ సాహెబ్ మాట్లాడుతూ..  మన ఐక్యత చెక్కుచెదరకుండా ఉండనివ్వండి. ప్రతి మతం, మతం మన దేశం యొక్క పురోగతి యొక్క ప్రయోజనాన్ని పొందాలి, కానీ కొంతమంది వాతావరణాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తారని అన్నారు. 
 
దేశంలో కొందరు అపార్థాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అలాంటి శక్తులను ఎదుర్కోవాలని అన్నారు. అందులో మ‌త పెద్ద‌ల పాత్ర ఎంతైనా ఉంద‌ని అన్నారు. మన పోరాటం నేటీ కోసం కాద‌నీ,  మన భవిష్యత్ తరాల కోసమ‌ని అన్నారు. మ‌నంద‌రిని నమ్మే వేల కోట్ల మంది ఉన్నారనీ, మన దేశ ఐక్యత, సమగ్రత విషయంలో రాజీ పడలేమ‌నీ, ప్రతి భారతీయుడు సురక్షితంగా ఉండే.. దేశంలో ఈ బలాన్ని ఎలా పెంచుకోవాలని,  దేశం నష్టపోతే మనమంతా నష్టపోతామ‌ని అన్నారు. 

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సర్వమత సామరస్యాన్ని కాపాడేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్చలో భాగంగా శనివారం సర్వమత సమావేశానికి పిలుపునిచ్చారు. ఇందులో వివిధ మతాల మత పెద్దలు సర్వమత సదస్సుకు హాజరయ్యారు. 

NSA అజిత్ దోవల్ పిలుపునిచ్చిన సర్వమత సామరస్య సమావేశంలో హైదరాబాద్ నుండి వచ్చిన ఆల్ ఇండియా సూఫీ సజ్జదాన్షిన్ కౌన్సిల్ (AISSC) చీఫ్ నసీరుద్దీన్ చిస్తీ PFI ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ స‌మ‌యంలో రాడికల్ సంస్థలను నియంత్రించడం, నిషేధించడం అవసరమని అన్నారు. AISSC అనేది ఓ రాడికల్ సంస్థ అనీ, ఆ సంస్థ‌కు వ్యతిరేకంగా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయ‌నీ, ఆ సంస్థ‌ను   నిషేధించాలని అన్నారు. 

AISSC చీఫ్ నసీరుద్దీన్ చిస్తీ మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా మతానికి బదులు అధర్మం వ్యాప్తి చెందుతుంద‌ని, నేడు మన దేశంలో యువత సమూలంగా మారుతోంది. దేశంలోని రాడికల్ శక్తుల నుండి దేశాన్ని కాపాడే బాధ్య‌త మ‌న‌కే ఉంద‌నీ, హిందుస్థాన్ అంటే అని మ‌తాల స‌మ్మేళ‌న‌మ‌నీ, ఇక్క‌డ  అన్ని మతాలు,  వర్గాల ప్రజలు నివసిస్తున్నారని అన్నారు. దేశంలో శాంతి, సామరస్యాలు నెలకొనేలా ప్రతి రాష్ట్రంలోనూ.. స‌ర్వ‌మ‌త స‌మ్మేళ‌నాల‌ను నిర్వ‌హించాల‌ని అన్నారు.  

మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ బ‌హిష్కృత నాయ‌కురాలు నూపుర్ శర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం 
వివాదాస్ప‌దంగా మారింది. అనంత‌రం.. ఉదయ్‌పూర్‌లో ఇద్దరు ముస్లిం యువకులు.. దర్జీ కన్హయ్య లాల్‌ను నరికి చంపిన హత్య ను  దేశం చూసింది. ఈ మ‌ర‌ణహోమాన్ని చిత్రీకరించి ప్రధాని నరేంద్ర మోదీని కూడా  బెదిరించారు. ISIS తరహాలో జరిగిన ఈ హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోంది. ఇదే త‌ర‌హాలో మహారాష్ట్రలో ఓ ఘ‌ట‌న జ‌రిగింది. అమరావతిలో ఉమేష్ కోల్హే అనే ఫార్మాసిస్ట్ హత్యకు గురయ్యాడు. ఈ విషయంపై కూడా కేంద్ర సంస్థ స్వయంగా విచారణ జరుపుతున్న విష‌యం తెలిసిందే.  అయితే, ఎన్‌ఎస్‌ఏ దోవల్ మత పెద్దలతో మతాల మధ్య సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కాదు.

PREV
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu