మ‌ణిపూర్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 15 మంది విద్యార్థులు మృతి..

By Mahesh RajamoniFirst Published Dec 21, 2022, 4:47 PM IST
Highlights

Manipur Road Accident: బుధవారం మణిపూర్‌లోని నోనీ జిల్లాలో టూర్‌కు వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందిన‌ట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.
 

Noney Road Accident: మణిపూర్ లోని ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. విహార‌యాత్ర‌కు వెళ్తున్న విద్యార్థుల‌తో ఉన్న స్కూల్ బ‌స్సు అదుపుతప్పి లోయ‌లో ప‌డిపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 15 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన‌ట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అధికారిక వివ‌రాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలోని నోని జిల్లాలో బుధవారం అదుపుత‌ప్పి స్కూల్ బస్సు బోల్తా పడటంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ కు 55 కిలోమీటర్ల దూరంలోని కొండ జిల్లాలోని లాంగ్సాయ్ ప్రాంతానికి సమీపంలో ఓల్డ్ కాచర్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది.

 

Manipur | Many feared injured after two school buses carrying students met with an accident in Khoupum of Noney district. The students were going on a study tour. More details awaited.

— ANI (@ANI)

తుంబల్న్ హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థులు నోని జిల్లాలోని ఖూపుమ్ వద్ద వార్షిక పాఠశాల స్టడీ టూర్కు రెండు బస్సులలో వెళ్లారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. వేదికల ప్రకారం, ఇంఫాల్‌లోని మెడిసిటీ ఆసుపత్రిలో 22 మంది విద్యార్థులు చేరారు. దీంతో పాటు ఈ ప్రమాదంపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.

 

Deeply saddened to hear about the accident of a bus carrying school children at the Old Cachar Road today. SDRF, Medical team and MLAs have rushed to the site to coordinate the rescue operation.

Praying for the safety of everyone in the bus. pic.twitter.com/whbIsNCSxO

— N.Biren Singh (@NBirenSingh)

ఓల్డ్ కచార్ రోడ్డులో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురికావడం తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అన్నారు. సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ఎస్డిఆర్ఎఫ్, వైద్య బృందం, ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఉన్న ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం రాష్ట్ర రాజధానికి తరలిస్తున్నామ‌ని చెప్పారు.

అయితే రెండు బస్సులు ప్రమాదానికి గురైనట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ప్రమాదంలో 15-20 మంది విద్యార్థులు మృతి చెందినట్టు తెలిపాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు యారిపోక్ లోని తంబల్న్ హయ్యర్ సెకండరీ పాఠశాలకు చెందినది. వారు విహార‌యాత్ర‌కు ఖౌపూమ్ కు వెళ్తున్నారు.

 

Manipur:

A bus carrying school students for a "Study tour" has suffered an accident on Khoupum road in Noney District.

As per reports, 20 students are feared to be dead, while many are critically injured.
Pray for them🙏 pic.twitter.com/i9eUXGunPI

— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer)


 

click me!