
Fodder Scam: పశుగ్రాస కుంభకోణం కేసులో రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.. ఈ దాణా కుంభకోణంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు కూడా ప్రమేయం ఉందని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ ఆరోపించారు. పశుగ్రాస స్కాం ప్రధాన సూత్రధారి శ్యాం బిహారి సిన్హా నుంచి నితీష్ కుమార్ డబ్బు తీసుకున్నారని ఆరోపించారు.
లాలూ ప్రసాద్పై పిటిషన్ దాఖలు చేయడంలో పాలుపంచుకున్న వారు పార్టీకి సలహాదారులుగా పనిచేస్తున్నారని, ఆయనతో సన్నిహితంగా ఉన్నారని నితీశ్ కుమార్ చెప్పడంతో తివారీ ఈ ప్రకటన చేశారు. నితీష్ కుమార్కు ప్రధాని మోదీ సోషలిస్ట్ నేత సర్టిఫికెట్ ఇచ్చారని తివారీ చెప్పుకొచ్చారు.
జార్ఖండ్ ట్రెజరీల నుండి అక్రమంగా విత్డ్రా చేశారనీ, దాణా కుంభకోణంలో నితీష్ కుమార్ కూడా ప్రమేయం ఉన్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. ఈ విషయాన్ని తివారీ సవాల్ చేశారు. ట్రెజరీల నుంచి అక్రమ విత్డ్రాయల్స్ అనంతరం నితీష్కు ముడుపులు ముట్టాయని చెప్పారని తివారీ గుర్తుచేశారు. ఈ ఆరోపణలను అంగీకరించే ధైర్యం ఉందా అని నితీష్కుమార్ కు సవాల్ విసిరారు. నితీష్ కుమార్పై ఉన్నా ఆరోపణను మళ్లీ పునరావృతం చేయాలని తాను సుశీల్ కుమార్ మోడీకి సవాలు విసురుతున్నానని తివారీ అన్నారు.
దాణా కుంభకోణంలో ప్రధాన సూత్రదారులైన శ్యామ్ బిహారీ సిన్హా ను తన జీవితాంతం కలవలేదని నితీష్ కుమార్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. శ్యామ్ బిహారీతో నితీష్ కుమార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో లంచం తీసుకున్నారని ఆరోపించారు తివారీ. లాలూ ప్రసాద్పై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన వారిలో తానూ ఒకడినని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని తివారీ అన్నారు.
"1996 మొదటి త్రైమాసికంలో చైబాసా జిల్లా (ప్రస్తుతం జార్ఖండ్లో) డిప్యూటీ కమీషనర్-కమ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ద్వారా పశుగ్రాసం కుంభకోణం మొట్టమొదట వెలికి వచ్చింది. పశుసంవర్థక శాఖ ద్వారా జిల్లా ట్రెజరీ నుండి కొంత అక్రమంగా డబ్బు ఉపసంహరించబడినట్లు గుర్తించారు. ఈ విషయం బీహార్ ఆర్థిక శాఖ కార్యదర్శి బిఎస్ దూబేకి చేరింది. అప్పట్లో లాలూ ప్రసాద్ అధికారంలో ఉన్నారు. ఆయన ఆదేశానుసారం విచారణకు ఆదేశాలు ఇచ్చారు. అతని ఆదేశానుసారం బిఎస్ దూబే వివిధ ట్రెజరీలపై విచారణ ప్రారంభించి డమ్కా, డోరాండా నుండి అక్రమంగా ఉపసంహరించుకున్నట్లు గుర్తించారు. " అని తివారీ అన్నారు.
‘‘విపక్షంలో ఉన్న నేతలు ఈ అక్రమాలు కనిపెట్టలేదు.. చైబాసా డిప్యూటీ కలెక్టర్కి దొరికింది. లాలూ ప్రసాద్పై ఆధిపత్యం ప్రదర్శించేందుకు బీజేపీ, జేడీయూ నేతలు దీన్ని అస్త్రంగా చేసుకున్నారు. సుశీల్కుమార్ మోదీ, రవిశంకర్ ప్రసాద్ తదితర బీజేపీ నేతలు ఈ కేసులో ఒత్తిడి తేవడంతో విజయం సాధించింది ’ అని తివారీ అన్నారు.
"అప్పట్లో లాలూ ప్రసాద్ బీహార్లో బలమైన నాయకుడు. ఆయనను ఓడించే ధైర్యం జెడి-యుకి లేదు. లాలూ ప్రసాద్ను కోర్టుకు లాగడం బిజెపి, జెడి-యుల వ్యూహం. లాలూ ప్రసాద్పై కేసు పెట్టడం అసలు ఉద్దేశం ఆయనను అధికారం నుంచి తప్పించి బీహార్లో నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిని చేయడమే’’ అని తివారీ పేర్కొన్నారు.