'2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది'

Published : Aug 11, 2023, 05:38 PM IST
'2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది'

సారాంశం

లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విరుచుకపడ్డారు. 2024లో భాజపా తుడిచిపెట్టుకుపోతుందా అని అడిగిన ప్రశ్నకు నితీష్ కుమార్ ఖచ్చితంగా అని అన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జోస్యం చెప్పారు. విపక్షాలు కలిసి భారత కూటమిని ఏర్పాటు చేయడంతో బీజేపీ తీవ్ర భయాందోళనకు గురవుతోందని నితీష్ కుమార్ అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతతో మోడీ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నదని కుమార్ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ముందే ఊహించారా? అని ప్రశ్నించగా.. ఖచ్చితంగా అని ప్రతిస్పందించారు. 

దేశాభివృద్ధి కోసం మనమందరం (విపక్షాలు) చేతులు కలిపామనీ, చాలా పార్టీలు భయంతో తమతో ఉన్నాయని నితీష్ కుమార్ అన్నారు. భారత కూటమి ఏర్పాటులో నితీష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. మణిపూర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన నితీష్ కుమార్, ఈ అంశాన్ని హైలైట్ చేస్తుందని అన్నారు. చర్చకు వచ్చిన మొదటి రెండు రోజులూ పార్లమెంట్‌కు గైర్హాజరు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి అధికారంలో ఉన్నప్పుడు,తన మంత్రి వర్గంలో తాను కూడా ఒక్కడిననీ, తాము సభలోనే ఉండటమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయనన్నారు. ఈ దేశ ప్రజలతో ఆరా తీస్తే.. బిజెపి ప్రచారాలు, ప్రకటనలపైనే దృష్టి పెడుతుందని, మీకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తాయా?" అని ప్రజలను ప్రశ్నించారు.

నితీష్ కుమార్ గతేడాది బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రీయ జనతాదళ్‌తో చేతులు కలిపి బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు.JD(U)-RJD ప్రభుత్వం నిన్నటితో ఏడాది పూర్తి చేసుకుంది. బీహార్ బిజెపి అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి రాష్ట్రంలోని 'మహాఘటబంధన్' ప్రభుత్వంపై విరుచుకుపడిన ఒక రోజు తర్వాత.. ముఖ్యమంత్రి "క్రచ్ రాజకీయాలు" ముగుస్తున్నాయని  నితీష్ కుమార్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu
Beers Price Drop : తెలుగోళ్లకూ కిక్కిచ్చే న్యూస్.. రూ.185 బీర్ ధర రూ.110 కి తగ్గిందోచ్..! మందుబాబులకు పండగే