
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన కారు రోడ్డుపై ఉన్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. కాగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు, అంబులెన్స్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సమాచారం ప్రకారం.. ఇస్కాన్ బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి థార్ వాహనం , డంపర్ లు ఢీకొన్నాయి. ప్రమాదాన్ని చూసేందుకు వంతెనపై జనం గుమిగూడారు. ఇంతలో అతివేగంతో దూసుకొచ్చిన జాగ్వార్ కారు అక్కడ ఉన్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీసు కానిస్టేబుల్, హోంగార్డు కూడా ఉన్నారు.
బుధవారం-గురువారం మధ్య రాత్రి సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఇస్కాన్ ఫ్లైఓవర్పై మహీంద్రా థార్ వెనుక నుండి డంపర్ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు సన్నాహాలు చేస్తుండగా, అతివేగంతో దూసుకొచ్చిన కారు జనాన్ని తొక్కేసింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. డబుల్ ప్రమాదం జరగడంతో, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. పోలీసులు ఇస్కాన్ వంతెన మొత్తాన్ని మూసివేశారు.