న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ లో కాల్పుల కలకలం..

Published : Oct 13, 2023, 12:41 PM IST
న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ లో కాల్పుల కలకలం..

సారాంశం

టికెట్ అడిగినందుకు టీటీఈతో గొడవల పడ్డ ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం ఏర్పడలేదు. 

పశ్చిమ బెంగాల్ : ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టిటిఇ)తో వాగ్వాదం తర్వాత న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 41 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపినట్లు తూర్పు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.

ధన్‌బాద్ నుండి 12313 UP సీల్దా-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కి చెందిన 12313 UP సీల్దా-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో B-8 కోచ్‌లో హర్విందర్ సింగ్ అనే 41 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఎక్కాడు. ఆ తరువాత ఏదో విషయంలో హర్విందర్ సింగ్ కు కోచ్ TTEతో వాగ్వాదం జరిగింది. దీంతో కోపానికి వచ్చిన హర్విందర్ సింగ్ కాల్పులు జరిపాడు" అని తూర్పు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

రూజ్ ప్యాసింజర్ హౌరా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు టికెట్ తీసుకున్నాడు, కాని ధన్‌బాద్ నుండి మరొక రైలు, అంటే సీల్దా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు వారు ఈ ప్రకటనలో తెలిపారు. కాల్పులు శబ్దం వినగానే రైలులోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఎస్కార్ట్ వెంటనే వ్యక్తిని పట్టుకున్నట్లు  తెలిపారు.

తప్పు టికెట్ తో ఎక్కి ఇలాంటి బీభత్సం సృష్టించాడని.. ప్రయాణీకులందరూ సరైన టిక్కెట్‌తో మాత్రమే రైలు ఎక్కాలని తూర్పు రైల్వే విజ్ఞప్తి చేస్తోందని ఆ ప్రకటనలో తూర్పు రైల్వే తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu