Food poisoning: పెళ్లి భోజనం తిన‌డంతో 150 మందికి అస్వ‌స్త‌త‌.. ఆస్పత్రికి త‌ర‌లింపు

Published : Aug 30, 2023, 05:55 AM IST
Food poisoning: పెళ్లి భోజనం తిన‌డంతో 150 మందికి అస్వ‌స్త‌త‌.. ఆస్పత్రికి త‌ర‌లింపు

సారాంశం

Belagavi: ఓ వివాహానికి విచ్చేసిన బంధువులు పెండ్లి భోజ‌నం చేయ‌డంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం భోజనం చేసిన రెండు గంటల తర్వాత చాలా మంది వాంతులు చేసుకోవడంతో పాటు డీహైడ్రేషన్ కు గురికావడంతో వారిని హిరేకోడి, చిక్కోడి పట్టణాల్లోని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.  

Nearly 150 hospitalised after eating at wedding: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో వడ్డించిన ఆహారాన్ని తిని దాదాపు 150 మంది అస్వస్థతకు గురయ్యారు. చిక్కోడిలోని హిరేకోడి గ్రామంలో ఈ వివాహ వేడుక జరిగినట్లు అధికారులు తెలిపారు. వడ్డించిన ఆహారం కల్తీ అని అనుమానించిన అధికారులు బెళగావి, బెంగళూరులోని ప్రభుత్వ ప్రయోగశాలలో పరీక్షించడానికి అందించిన నీటితో సహా ఆహార నమూనాలను పంపారు.

పెళ్లి వేడుకలో భోజనం చేసిన సుమారు 150 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారని చిక్కోడి జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్హెచ్ గదాద్ తెలిపారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉండటంతో ఆరోగ్య శాఖ వారిని అత్యవసర కేసుగా పరిగణిస్తోంది. అందరూ కోలుకోగా, మరికొందరు ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని స‌మాచారం. వివాహ వేడుకలో వడ్డించిన ఆహారం, నీటిని బెళగావి, బెంగళూరులోని ప్రభుత్వ ప్రయోగశాలలకు పంపించామనీ, దాని నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపడతామని ఆయన చెప్పారు.

సోమవారం భోజనం చేసిన రెండు గంటల తర్వాత చాలామంది వాంతులు చేసుకుని డీహైడ్రేషన్ కు గురయ్యారు. వారిని హిరేకోడి, చిక్కోడి పట్టణంలోని స్థానిక ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లకు తరలించారు. ఇవే సమస్యలతో మంగళవారం ఉదయం 50 మందికి పైగా చిక్కోడి ఆసుపత్రుల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలలో అత్యవసర తాత్కాలిక క్లినిక్ ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్న గ్రామానికి వైద్య బృందాన్ని ఆరోగ్యశాఖ పంపింది. అంబులెన్సులు, అదనపు వైద్య బృందాలను గ్రామానికి రప్పించారు. అస్వ‌స్థ‌త‌కు గురైనా.. 90 శాతం మంది కోలుకున్నారనీ, అయితే వారిని అబ్జర్వేషన్లో ఉంచడంతో డిశ్చార్జి చేయలేదని రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ఈ ప్ర‌మాదంతో గాయ‌ప‌డ్డ‌వారంతా కోలుకుంటున్నారనీ, బుధవారం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేస్తామని బెళగావి ఎస్పీ సంజీవ్ పాటిల్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Modi Visits Kashi Vishwanath Temple:వారాణసి శ్రీకాశీవిశ్వనాథ ఆలయంలో మోదీ పూజలు| Asianet News Telugu
ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?