శివసేన వివాదం.. ఎన్నికల సంఘం నిర్ణయంపై స్పందించిన శరద్ పవార్ .. ఇంతకీ ఏమన్నారంటే..?   

Published : Feb 22, 2023, 11:50 PM IST
శివసేన వివాదం.. ఎన్నికల సంఘం నిర్ణయంపై స్పందించిన శరద్ పవార్ .. ఇంతకీ ఏమన్నారంటే..?    

సారాంశం

శివసేన పార్టీ మీద కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ తాజాగా స్పందించారు. పార్టీ పేరు, ‘విల్లు-బాణం’ గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతుగా నిలిచారు. శివసేన ఎన్నికల గుర్తు వివాదంలో బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

మహారాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై జరుగుతున్న రచ్చ ఆగిపోవడం లేదు. తాజాగా శివసేన పార్టీ మీద కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తాజాగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ,  బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒక సిద్ధాంతం, పార్టీ దేశంలో సోదరభావాన్ని నాశనం చేస్తున్నాయని అన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ వ్యవస్థపై ఇంతటి దాడి జరగలేదన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని రాజ్యాంగ సంస్థపై దాడి జరుగుతోందని విరుచుకపడ్డారు. నేటి ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీలను పని చేయడానికి అనుమతించడం లేదనీ, ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుంటున్నారని, ఇది రాజకీయ పార్టీపై దాడి అని విమర్శించారు. ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం ఎప్పుడూ ఇవ్వలేదనీ, ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తొలిసారి.

ఇది కాకుండా.. శరద్ పవార్ కాంగ్రెస్, ఎన్‌సిపి మధ్య జరిగిన పోరాటాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. శివసేనను బాలాసాహెబ్ థాకరే స్థాపించారనీ, దాని ఎన్నికల గుర్తును కమిషన్ మరొకరికి ఇచ్చింది. నేను కూడా కాంగ్రెస్‌తో పోరాడాననీ అన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ గుర్తు, కానీ ఆ సమయంలో ఎన్నికల కమిషన్ నిర్ణయం సరైనది. తన తర్వాత శివసేన బాధ్యతలు ఉద్ధవ్ ఠాక్రేకు అప్పగిస్తానని, బాలాసాహెబ్ ఠాక్రే తన చివరి రోజుల్లో చెప్పారని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టులో ఏం జరిగింది?

మరోవైపు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం (ఫిబ్రవరి 22) విచారణ జరిపింది. ఏక్‌నాథ్ షిండే వర్గానికి నోటీసులు జారీ చేసిన కోర్టు.. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించలేదు. ఇప్పుడు దొరికిన తాత్కాలిక పేరు, ఎన్నికల గుర్తును ఉద్ధవ్ గ్రూపు ఉపయోగించుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ 3 వారాల తర్వాత జరుగుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu