Narendra Singh Tomar: యోగి నాయకత్వంలో యూపీ తన పూర్వ వైభవాన్ని పొందుతోంది

Published : Dec 04, 2024, 10:51 PM IST
Narendra Singh Tomar: యోగి నాయకత్వంలో యూపీ తన పూర్వ వైభవాన్ని పొందుతోంది

సారాంశం

Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌  పై ఎంపీ అసెంబ్లీ స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్ ప్రశంసలు కురిపించారు. మహారాణా ప్రతాప్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 92వ వ్యవస్థాపక వారోత్సవాల్లో యోగి ప్రభుత్వం సాధించిన విజయాలను, రాష్ట్ర అభివృద్ధి, మార్పుల గురించి ఆయన మాట్లాడారు.

Yogi Adityanath: ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌కి ఎవరూ రావడానికి ఇష్టపడేవారు కాదు.. కానీ, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యూపీ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతోందని  మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. చట్టం-వ్యవస్థ, పెట్టుబడులు, ఆరోగ్య రంగం, పేదరిక నిర్మూలన, జాతీయ విద్యా విధానం అమలు.. ఇలా ఏ రంగంలో చూసినా యోగి ప్రభుత్వం విజయవంతంగా ముందుకెళ్తోందని అన్నారు.

బుధవారం మహారాణా ప్రతాప్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 92వ వ్యవస్థాపక వారోత్సవాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తోమర్ మాట్లాడుతూ.. యోగి ఆదిత్యనాథ్‌ను అనేక సందర్భాల్లో కలిశానని, గోరక్షపీఠాధిపతిగా ఆయన భక్తి యోగాన్ని బోధిస్తే, రాజకీయ నాయకుడిగా కర్మ యోగాన్ని బోధిస్తున్నారని అన్నారు. గోరక్షపీఠాధిపతిగా ఆయన సాధన ప్రేరణాత్మకమైనదని, రాజకీయ నాయకుడిగా, ఎంపీగా, సీఎంగా ఆయన చేసిన పనికి ఎంత ప్రశంసించినా తక్కువేనని అన్నారు. 

గోరక్షపీఠం ప్రాజెక్ట్ అయిన మహారాణా ప్రతాప్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రజా సంక్షేమానికి చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ.. సాధారణంగా ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా భక్తి యోగాన్ని బోధిస్తుందని, కానీ గోరక్షపీఠం భక్తి యోగాతో పాటు కర్మ యోగాన్ని కూడా బోధిస్తూ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు. ఈ కోణంలో గోరక్షపీఠం, దాని అనుబంధ సంస్థ అయిన మహారాణా ప్రతాప్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.

సర్వాంగీణ అభివృద్ధే ఎంపీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లక్ష్యం

కొన్ని సంస్థలు విద్యారంగంలో, మరికొన్ని సాంకేతిక విద్యారంగంలో పనిచేస్తుంటాయని, కానీ మహారాణా ప్రతాప్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విషయానికి వస్తే, సర్వాంగీణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే దాని లక్ష్యమని తోమర్ అన్నారు. ఈ కౌన్సిల్ 50కి పైగా సంస్థలను నిర్వహిస్తుండటం అద్భుతమని, విద్యారంగంలో ఈ కౌన్సిల్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.

సీఎం యోగి నాయకత్వంలో ఎడ్యుకేషన్ కౌన్సిల్ వటవృక్షంగా ఎదిగింది

స్వాతంత్య్రం తర్వాత దేశ భవిష్యత్తు కోసం మహంత్ దిగ్విజయ్‌నాథ్ ఈ కౌన్సిల్‌కు విత్తనం నాటారని, మహంత్ అవైద్యనాథ్ దాన్ని పెంచి పోషించారని, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో అది వటవృక్షంగా ఎదిగిందని తోమర్ అన్నారు. దాని నీడలో ఇప్పుడు మొత్తం పూర్వాంచల్ ప్రాంతం గర్వపడుతోందని అన్నారు.

పీఎం మోడీ నాయకత్వంలో భారత్ దూసుకెళ్తోంది

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ దూసుకెళ్తోందని, ఆయన చాతుర్యం, ధైర్యం, కృషి కారణంగా ప్రపంచ పటంలో భారత్ ఖ్యాతి మరింత పెరిగిందని తోమర్ అన్నారు. ఒకప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పెద్దగా గుర్తింపు ఉండేది కాదని, కానీ ఇప్పుడు ఏ అంతర్జాతీయ వేదిక అయినా భారత్‌ను పట్టించుకోకుండా ఉండలేదని అన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేది మోడీ లక్ష్యమని, దాని సాధనలో మనమంతా పాలుపంచుకోవాలని అన్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా విప్లవాత్మక మార్పులు వస్తాయని, విద్య ద్వారా దేశానికి సమర్థవంతమైన మానవ వనరులు లభిస్తారని అన్నారు.

విద్యకు పరిమితులు లేవు: ప్రొ. రాజీవ్ కుమార్

మహారాణా ప్రతాప్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వ్యవస్థాపక వారోత్సవాల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) సభ్య కార్యదర్శి ప్రొ. రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో అమలవుతున్న జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా విద్యకు విషయాల పరిమితులు తొలగిపోయాయని, విద్యార్థులు ఏ స్ట్రీమ్ నుంచి అయినా మరో స్ట్రీమ్‌కి మారవచ్చని అన్నారు. NEP ద్వారా విద్య, ఉపాధి రంగాలకు విస్తృత అవకాశాలు లభించాయని, విద్యార్థులు తమ డిగ్రీలను తమకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చని అన్నారు. NEP ద్వారా మాతృభాషలో విద్యను అభ్యసించే అవకాశం లభించిందని, ప్రస్తుతం 12 భారతీయ భాషల్లో సాంకేతిక విద్యను అభ్యసించవచ్చని, ఈ విద్యా విధానం యువతను నవకల్పనల వైపు ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇప్పుడు నియంత్రణ సంస్థలు విద్యా సంస్థలకు సహకార సంస్థలుగా మారాయని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్
ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu