మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మోడీ ఘన స్వాగతం

Published : Oct 11, 2019, 05:23 PM IST
మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మోడీ  ఘన స్వాగతం

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలోని షోర్ ఆలయం రెండు దేశాల కీలక నేతలకు అతిథ్యం ఇచ్చింది. 


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలోని షోర్ దేవాలయంలో చైనా అధ్యక్షుడు  జిన్‌పింగ్, భారత ప్రధాని మోడీ కలుసుకొన్నారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుక్రవారం నాడు  చెన్నై చేరుకొన్నారు. చెన్నై నుండి జిన్‌పింగ్ నేరుగా  మహాబలిపురం చేరుకొన్నారు. మహాబలిపురం ఆలయం వద్ద భారత ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కు ఘనంగా స్వాగతం పలికారు.

ఇండియా ప్రధాని మోడీ తమిళనాడు సంప్రదాయం ప్రకారంగా పంచె కట్టులో చైనా అధ్యక్షుడికి స్వాగతం పలికారు. షోర్ ఆలయంలో తిరుగుతూ ఆలయానికి సంబంధించిన చరిత్రను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీకి ఆయన వివరించారు.

ఈ ఆలయంలో అర్జున తపస్సు ప్రాంతం చరిత్రలో ప్రసిద్ది చెందింది. . ఈ ప్రాంతంలోనే వెయ్యేళ్ల క్రితమే ఓడరేవులు ఉన్నాయి. చైనా నుండి ఈ ప్రాంతం నుండి వాణిజ్య సంబంధాలు కొనసాగించినట్టుగా చెబుతారు.

PREV
click me!

Recommended Stories

Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ
సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People