ముంబైలో మహిళపై యాసిడ్ దాడి.. నిందితుడి అరెస్ట్.. 

Published : Jan 14, 2023, 06:56 AM IST
ముంబైలో మహిళపై యాసిడ్ దాడి.. నిందితుడి అరెస్ట్.. 

సారాంశం

దక్షిణ ముంబైలోని లోకమాన్య తిలక్ మార్గ్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున యాసిడ్ దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితురాలికి తెలిసిన 62 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. 

దేశంలో మహిళలపై యాసిడ్‌ దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ దాడులు మానవత్వానికి  మాయని మచ్చలా మారుతున్నాయి. మరో రకంగా చెప్పాలంటే.. ఈ  దాడులను పురుషాహంకారానికి ప్రతీకగా చూడాల్సి ఉంటుంది. తాజాగా  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. 

దక్షిణ ముంబైలోని లోకమాన్య తిలక్ మార్గ్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో ఒక మహిళ తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలికి తెలిసిన 62 ఏళ్ల వ్యక్తే దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. దాడి తర్వాత తనను తీసుకెళ్లిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులను అప్రమత్తం చేశారని చెప్పారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సహా అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

గతంలో ఉన్న గొడవల కారణంగానే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.  తెల్లవారుజామున 5.30 గంటలకు నీరు నింపుతున్న మహిళపై యాసిడ్ పోశారని అధికారి తెలిపారు. నిందితుడు మొదట ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో సమీపంలోనే పట్టుబడ్డాడు. యాసిడ్ మరియు క్రిమినల్ బెదిరింపుల ద్వారా హత్యాయత్నానికి పాల్పడినందుకు, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 326(A), 307, 504, 506 కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu