ఈ ఏడాదిలో జూన్ నాటికి 87,026 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు : కేంద్రం

Published : Jul 22, 2023, 07:54 PM IST
ఈ ఏడాదిలో జూన్ నాటికి 87,026 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు :  కేంద్రం

సారాంశం

New Delhi: 2020 నుంచి ఇప్పటివరకు 5,61,272 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్ స‌భ‌లో ప్రవేశపెట్టిన ఒక ప్రకటన ప్రకారం.. 2020 లో మొత్తం 85,256 మంది వ్యక్తులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. కానీ తరువాతి రెండు సంవత్సరాలలో ఈ సంఖ్య పెరిగింది, 2021 లో 1,63,370 మంది, 2022 లో 2,25,620 మందికి చేరుకుంది.

Indian citizenship: ఈ ఏడాది జూన్ వరకు 87,026 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. దీంతో 2011 నుంచి ఇప్పటి వరకు 17.50 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

వివ‌రాల్లోకెళ్తే.. 2020 నుంచి ఇప్పటివరకు 5,61,272 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్ స‌భ‌లో ప్రవేశపెట్టిన ఒక ప్రకటన ప్రకారం.. 2020 లో మొత్తం 85,256 మంది వ్యక్తులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. కానీ తరువాతి రెండు సంవత్సరాలలో ఈ సంఖ్య పెరిగింది, 2021 లో 1,63,370 మంది, 2022 లో 2,25,620 మందికి చేరుకుంది. ఇదివ‌ర‌క‌టి 2011లో అత్య‌ధికంగా 1,22,819 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్న దాని కంటే అత్యధికమ‌ని ప్రభుత్వ డేటా చూపించింది. 011 నుంచి ఇప్పటి వరకు 17,50,466 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.

''గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ పౌర‌స‌త్వ‌ కార్యాలయాన్ని అన్వేషించే భారతీయ పౌరుల సంఖ్య గణనీయంగా ఉంది. వారిలో చాలా మంది వ్యక్తిగత సౌలభ్యం కోసం విదేశీ పౌరసత్వాన్ని ఎంచుకున్నారని'' మంత్రి తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయ సమాజాన్ని దేశానికి ఆస్తిగా గుర్తించిన జైశంకర్, ప్రవాస భారతీయులతో సంబంధాల్లో ప్రభుత్వం పరివర్తనాత్మక మార్పును తీసుకువచ్చిందని అన్నారు. విజయవంతమైన, సంపన్నమైన-ప్రభావవంతమైన డయాస్పోరా భారతదేశానికి ఒక ప్రయోజనమ‌నీ,  డయాస్పోరా నెట్వర్క్ ల‌ను అందిపుచ్చుకోవడం, జాతీయ ప్రయోజనాల కోసం దాని ఖ్యాతిని ఉపయోగించుకోవడమే తమ విధానమ‌ని" ఆయన అన్నారు.

భారత్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదనీ, ఇతర దేశాల్లో పౌరసత్వం కోరుకునే వారు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవాలన్నారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం పని అని ఆయన చెప్పారు. భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారు సూడాన్, యెమెన్, మయన్మార్ వంటి తెలిసిన భద్రతా పరిస్థితులతో పాటు భారతదేశ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకతో సహా 135 ఇతర దేశాలకు వెళ్లారని ప్రభుత్వ డేటా చూపిస్తుంది. అయితే ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో వెల్ల‌డించ‌లేదు. జైశంకర్ ప్రకారం, భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోవడానికి ప్రధాన కారణం పని. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ కార్యాలయాన్ని అన్వేషిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా ఉందని జైశంకర్ తెలిపారు. వారిలో చాలా మంది వ్యక్తిగత సౌలభ్యం కోసం విదేశీ పౌరసత్వం తీసుకోవడానికి కూడా ఎంచుకున్నార‌ని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Highway Photos: బంపర్ ఆఫర్.. హైవేపై ఫోటోలు తీయండి, ఫోటోకు రూ.1000 బహుమతి పొందండి
CM Revanth Reddy in Kerala: కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి| Asianet News Telugu