మోర్బీ బ్రిడ్జి విషాదంలో కీలక పరిణామం.. ఒరెవా గ్రూప్‌ ఎండీ జయసుఖ్‌ పటేల్‌ని కస్టడీకి తరలించిన కోర్టు..

Published : Feb 02, 2023, 04:24 AM ISTUpdated : Feb 02, 2023, 04:39 AM IST
మోర్బీ బ్రిడ్జి విషాదంలో కీలక పరిణామం.. ఒరెవా గ్రూప్‌ ఎండీ జయసుఖ్‌ పటేల్‌ని కస్టడీకి తరలించిన కోర్టు..

సారాంశం

గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి ప్రమాదంలో నిందితుడైన ఒరెవా గ్రూప్‌ ఎండీ జయసుఖ్‌ పటేల్‌ను కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఈ ప్రమాదంలో 135 మంది మరణించారు. జైసుఖ్ మంగళవారం కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసులో 1,262 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. ఇందులో జైసుఖ్ పటేల్ పేరును కూడా నిందితుడిగా చేర్చారు. ఈ ఘటన గతేడాది అక్టోబర్‌లో జరిగిన సంగతి తెలిసిందే.

మోర్బీ బ్రిడ్జి విషాదం: గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడైన  ఒరేవా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జయసుఖ్ పటేల్‌ను కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఈ ప్రమాదంలో 135 మంది మరణించారు. జైసుఖ్ మంగళవారం కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసులో 1,262 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. వంతెన మరమ్మతులు చేసిన ఒరెవా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జైసుఖ్ పటేల్ పేరును కూడా నిందితుడిగా చేర్చారు. ఈ ఘటన గతేడాది అక్టోబర్‌లో జరిగిన సంగతి తెలిసిందే.
 
మోర్బి వంతెన ప్రమాదం  

గతేడాదిఅక్టోబరు 30న సాయంత్రం 6.32 గంటలకు మోర్బీలోని మణి మందిర్ సమీపంలోని మచ్చు నదిపై ఉన్న 140 ఏళ్ల నాటి వేలాడే వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చాలా మంది అమాయక చిన్నారులు సహా 135 మంది ప్రాణాలు కోల్పోయారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రమాద సమయంలో 400 మందికి పైగా ఉన్నారు. వంతెన సామర్థ్యం 100 మంది. మోర్బి రాజు సర్ వాఘ్జీ ఈ కేబుల్ బ్రిడ్జిని తన రాజాస్థానం నుండి రాజ్ మహల్‌కు వెళ్లేందుకు ఉపయోగించారు. ఈ వంతెన అతని హయాంలో నిర్మించబడింది. రాజు తన రాచరికం ముగిసిన తర్వాత ఈ వంతెన బాధ్యతను మోర్బీ మున్సిపాలిటీకి అప్పగించాడు.

ఈ క్రమంలో వచ్చే 15 సంవత్సరాలకు అంటే 2037 వరకు వంతెన మరమ్మతు, నిర్వహణ బాధ్యతలను ఒరెవా కంపెనీకి అప్పజెప్పింది మోర్బీ మున్సిపాలిటీ. ఈ మేరకు ఇరువురి మధ్య ఒప్పందం కుదురింది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం.. వంతెనను మర్మమత్తు చేసి 8 నుండి 12 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలి. కానీ 6 నెలల్లో ఎటువంటి సాంకేతిక సహాయం లేకుండా వంతెన పునరుద్ధరణకు కాంట్రాక్ట్ ఇవ్వబడింది. ప్రమాదం సమయంలో.. వంతెనపైకి 400 మందికి పైగా వెళ్లేందుకు అనుమతించారు.

మోర్బిలో మచ్చు నదిపై బ్రిటిష్ కాలం నాటి వేలాడే వంతెన 2022 అక్టోబర్ 30న కూలిపోయింది. ఈ సందర్భంలో.. రాష్ట్ర ప్రభుత్వం గత వారం మోర్బి ప్రమాదంలో షో-కాజ్ నోటీసు జారీ చేసింది . తన బాధ్యతను నెరవేర్చలేకపోయినందుకు మున్సిపాలిటీని ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించారు. దీనిపై జనవరి 25లోగా లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఆ నోటీసులో మున్సిపాలిటీని ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

100 కాదు 132 శాతం లక్ష్యం... యువతకు ఉపాధిలో ఈ ప్రాంతం రికార్డు
మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu