దేశ‌వ్యాప్తంగా దంచికొడుతున్న వాన‌లు.. భారీ వ‌ర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చ‌రిక‌లు

Published : Jun 26, 2023, 07:29 PM IST
దేశ‌వ్యాప్తంగా దంచికొడుతున్న వాన‌లు.. భారీ వ‌ర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చ‌రిక‌లు

సారాంశం

Monsoon: దేశ‌వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతున్నాయి. ఈశాన్య భారతంలో, ముఖ్యంగా అస్సాం ప్రాంతంలో వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి, గాలి సరళి కూడా మారిందని స్కైమెట్ తెలిపింది. ఇది ఎక్కువ కాలం ఉండకపోవచ్చున‌నీ, తూర్పు దిశల నుండి గాలి సరళిలో మరోసారి మార్పు మొద‌లుకావ‌డంతో రెండు రోజుల తర్వాత నైరుతి రుతుపవనాలు మళ్లీ ఈ ప్రాంతంలో వీయడం ప్రారంభిస్తాయని, తద్వారా భారీ వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.   

India Heavy rains: రుతుపవనాలు దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం చాలా రాష్ట్రాలు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ఈ ఏడాది రుతుపవనాలు దేశంలోని 80 శాతం ప్రాంతాలను కవర్ చేశాయని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ సోమవారం తెలిపినట్టు పీటీఐ నివేదించింది. ఆదివారం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ-ఎన్సీఆర్, హర్యానాలోని చాలా ప్రాంతాలను కవర్ చేసిన నైరుతి రుతుపవనాలు సోమవారం గుజరాత్, హర్యానా, పంజాబ్ కు విస్తరించాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో దేశంలోని పలు ప్రాంతాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

 

 

వాయువ్య ఒడిశాలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి పశ్చిమ వాయవ్య దిశలో పయనించనుండటంతో ఛత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. "ఒడిశాపై అల్పపీడన ప్రభావం రాగల 24 గంటల్లో కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఒడిశాలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసినట్లు భువనేశ్వర్ వాతావరణ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ హబీబుర్ రెహ్మాన్ బిశ్వాస్" తెలిపారు. ఇదిలావుండ‌గా, 62 ఏళ్ల తర్వాత తొలిసారిగా రుతుపవనాలు ఢిల్లీ, ముంబయిల్లో ఒకే రోజు అడుగుపెట్టాయి. ముంబయిలో రుతుపవనాలు ప్రారంభమయ్యే సాధారణ తేదీ జూన్ 11 కాగా, ఢిల్లీకి జూన్ 27, అయితే ఈ సంవత్సరం, వర్షపు మేఘాలు అనేక పశ్చిమ రాష్ట్రాలలో వెనుకబాటుతో దేశాన్ని కప్పివేయడానికి అసాధారణ మార్గాన్ని అనుసరించాయి. "చివరిసారిగా రుతుపవనాలు 21 జూన్ 1961న ఢిల్లీ, ముంబ‌యి రెండింటినీ ఒకేసారి కవర్ చేశాయి. ఆ ఏడాది రుతుపవనాలు దేశంలోని మిగిలిన ప్రాంతాలను అదే రోజున కవర్ చేశాయి" అని ఐఎండీ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో దేశంలోని పలు ప్రాంతాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్ -మనాలి జాతీయ రహదారి (ఎన్ హెచ్ -21)పై వందలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదల ముప్పు కారణంగా రాంబన్ లోని 10వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలను అధికారులు మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్ లో రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మ‌రిన్ని రోజులు కొన‌సాగుతాయ‌ని ఐఎండీ తెలిపింది. మరో నాలుగైదు రోజుల పాటు రుతుపవనాలు కొనసాగుతాయని హిమాచల్ ప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ సురేంద్ర పాల్ తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu
CBSE కొత్త రూల్.. పిల్లలపై భారం తప్పదా? 3 భాషలు చదవాల్సిందేనా? | Asianet News Telugu