దారుణం : 13 యేళ్ల బాలికపై 16మంది అత్యాచారం.. గొర్రెలు మేపుతుంటే కిడ్నాప్ చేసి... రెండు రోజుల పాటు దారుణం.. !

Published : Feb 14, 2022, 01:02 PM IST
దారుణం : 13 యేళ్ల బాలికపై 16మంది అత్యాచారం.. గొర్రెలు మేపుతుంటే కిడ్నాప్ చేసి... రెండు రోజుల పాటు దారుణం.. !

సారాంశం

గొర్రెలు మేపుతున్న మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెమీద లైంగిక దాడికి పాల్పడ్డారు. రెండు రోజులపాటు 16 మంది అత్యంత పాశవికంగా రేప్ చేశారు. వారినుండి తప్పించుకుని వచ్చిన బాలిక చెప్పిన విషయాలు విని..

రాజస్థాన్  : ఆ బాలిక సమీప అటవీ ప్రాంతంలో Sheep మేపుతూ ఉంటుంది. ప్రతి రోజూ లాగానే శుక్రవారం ఉదయం కూడా గొర్రెలను తీసుకుని forestలోకి వెళ్ళింది. ఉదయం 11 గంటల సమయంలో ఆమెను ఒంటరిగా చూసిన ఐదుగురు వ్యక్తులు బలవంతంగా బైక్ మీద ఎత్తుకెళ్లారు. కొందరు పిల్లలు ఆ దృశ్యాన్ని చూసి ఊర్లోకి వెళ్లి అందరికీ చెప్పారు. గ్రామస్తులు ఎంత వెతికినా ఆ బాలిక కనిపించలేదు. చివరికి ఆమె రెండు రోజుల తర్వాత ఆదివారం ఇంటికి చేరుకుంది. ఆమె చెప్పింది విని అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.

Rajasthanలోని భరత్ పూర్  సమీపంలోని కోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నఓ గ్రామానికి చెందిన 13 year old girl ప్రతిరోజు అడవిలో గొర్రెలను మేపుతూ ఉంటుంది. శుక్రవారం ఉదయం ఆమె అడవిలోఉండగా ఐదుగురు వ్యక్తులు ఆమె దగ్గరకు బైక్లపై వచ్చారు. ఆమెను బలవంతంగా ఎత్తికెళ్లిపోయారు. ఆ ఘటనను చూసి వెంటనే ఊర్లోకి వెళ్లి.. గ్రామస్తులకు తెలిపారు. అది విన్న గ్రామస్తులు షాక్ అయ్యారు. వెంటనే పరుగున అడవిలోకి వెళ్లి చాలాసేపు అన్ని దిక్కులా గాలించారు. అయినా ఆ బాలిక ఆచూకీ దొరకలేదు.

కాగా, బాలిక మిస్సయిన రెండు రోజుల తర్వాత ఆదివారం మధ్యాహ్నం ఇంటికి చేరుకుంది. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బాలికను ఎవరు తీసుకెళ్లారు.. ఎలా వచ్చింది అన్న విషయాలను ఆరా తీయగా.. ఆ చిన్నారి చెప్పింది విని షాక్ అయ్యారు. తనను రెండు రోజుల పాటు 16 మంది అత్యాచారం చేశారని చెప్పింది. ఎంత ఏడ్చినా వదల్లేదని.. ఆహారం కూడా పెట్టలేదని.. నిద్రపోనివ్వలేదని,, ఆ బాలిక ఏడుస్తూ తన తండ్రి చెప్పింది.  

ఈ విషయం విన్న బాలిక తండ్రి తట్టుకోలేకపోయాడు. వెంటనే  ఆ బాలిక తండ్రి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను మెడికల్ టెస్టులకు పంపించారు. ఆ రిపోర్టులు వచ్చిన తరువాత దర్యాప్తు ప్రారంభిస్తామని, నిందితులెవ్వరినీ వదలమని చెప్పారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని visakhapatnamలో జనవరి 22న దారుణం జరిగింది.. ‘అన్నయ్యా..’ అని పిలిచినా కనికరించలేదు.. కాళ్ళ వేళ్ళు పడ్డ వదిలిపెట్టలేదు.. నోరెత్తితే.. చంపేస్తానని కత్తితో బెదిరించాడు. ‘అన్నయ్యను కాదు, మావయ్య అవుతా’’ అంటూ.. సినిమా డైలాగులు కొడుతూ..  అభం శుభం తెలియని 11యేళ్ల చిన్నారిపై Sexual assault చేశాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన జనవరి 20 రాత్రి నక్కపల్లి మండలం రాజపేటలో జరిగింది.  

11 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన  నాగేష్ (22) అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాధితురాలి ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…బాధిత బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. వంట చెరుకు కోసం ఆమె సోదరి పక్కనే ఉన్న Cashew gardenకి వెళ్ళింది. ఆమెకు సహాయపడేందుకు బాధితురాలు కూడా తోటకు బయలుదేరింది. ఈ విషయం గమనించిన నిందితుడు ఆమె వెంట వెళ్లి ఈ అఘాయిత్యం చేశాడు. బాలిక నోట్లో గుడ్డలు కుక్కి.. తోటలోకి లాక్కెళ్లాడు. 

తర్వాత బాలిక మీద అమానుషంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. నగ్నంగా ఫొటోలు, వీడియో తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని  కత్తితో బెదిరించాడు. అంతేకాకుండా బాధితురాలి సోదరిని, తల్లిని సైతం స్నానం చేసేటప్పుడు వీడియోలు తీసి తన నిమొబైల్ కి పంపించాలి అని చెప్పాడు. అలా ఆ బాలికను నాలుగు గంటల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. ఎవరికీ చెప్పనని ఒదిలి పెట్టాలంటూ ఆ చిన్నారి కాళ్లావేళ్లా పడడంతో.. రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటి వద్ద వదిలి వెళ్ళాడు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?