ప్రియుడితో లేచిపోవడం కోసం: కుటుంబానికి విషమిచ్చిన బాలిక

Siva Kodati |  
Published : Sep 13, 2019, 08:32 AM IST
ప్రియుడితో లేచిపోవడం కోసం: కుటుంబానికి విషమిచ్చిన బాలిక

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో లేచిపోవాలని భావించిన ఓ బాలిక కుటుంబం మొత్తానికి విషం పెట్టింది

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో లేచిపోవాలని భావించిన ఓ బాలిక కుటుంబం మొత్తానికి విషం పెట్టింది. వివరాల్లోకి వెళితే.. మొరాదాబాద్‌కు చెందిన ఓ మైనర్ బాలిక‌ అర్వింద్ అనే యువకుడిని ప్రేమించింది.

అయితే తల్లిదండ్రులు తమ పెళ్లికి అంగీకరించరని భావించిన ఆమె.. తన ప్రియుడితో కలిసి పథకం వేసింది. దీనిలో భాగంగా కుటుంబసభ్యులు తినే ఆహారంలో విషం కలిపిపెట్టింది.

ఈ సంగతి తెలియని వారు... ఆ ఆహారం తినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తాను తప్పించుకోవడానికి ఇదే సరైన సమయమని భావించిన బాలిక ప్రియుడితో కలిసి లేచిపోయింది.

ఈ నేపథ్యంలో బయట పనిముగించుకుని ఇంటికొచ్చిన బాలిక తండ్రికి.. కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలో పడివుండటాన్ని చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు వారిని ప్రాణాపాయం నుంచి కాపాడటంతో ఆయన ఊపిరి పీల్చుకున్నాడు.

అనంతరం తన కన్నబిడ్డే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిందని తెలియడంతో ఆ తండ్రి కుమిలిపోయాడు. మరోవైపు అర్వింద్ అనే వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేసినట్లు ఆయన గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసులో జైలుకు వెళ్లిన ఆ యువకుడు.. కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఇటీవలే బెయిల్‌పై బయటకొచ్చిన అతడు.. బాధితురాలి అన్నదమ్ములను చంపేస్తానని బెదిరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమ జంట కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word