భర్త చనిపోయిన పదేళ్లకు మరో పెళ్లికి సిద్ధమైన తల్లి.. తట్టుకోలేక ఆ కొడుకు చేసిన పని..

By SumaBala BukkaFirst Published Jan 16, 2023, 12:53 PM IST
Highlights

తండ్రి చనిపోయిన పదేళ్లు తల్లి వేరేవ్యక్తితో ప్రేమలో పడి, పెళ్లికి సిద్ధపడడం తట్టుకోలేని యువకుడు ఆత్మహత్య చేసకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. 

ఉత్తరప్రదేశ్ : ఓ తల్లి చేసిన పని ఆ పిల్లల పాలిట శాపంగా మారింది. వారి సున్నిత హృదయాల్ని తూట్లు పొడిచింది. అంతే తట్టుకోలేక ఆ మహిళ టీనేజ్ కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే...భర్త చనిపోయిన పదేళ్లకు మరో వ్యక్తితో ప్రేమలో పడి, వివాహేతర సంబంధం పెట్టుకుంది. పిల్లలను వదిలేసి అతడితో వెళ్లిపోయింది. 

వివరాల్లోకి వెడితే.. ఉత్తరప్రదేశ్ లోని ఓ 40 యేళ్ల మహిళ భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు కొడుకు, కూతురు ఇద్దరున్నారు. కూలీపనులు చేసుకుంటూ..పిల్లలిద్దరినీ చదివించుకుంటుంది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం ఆమె ఓ వ్యక్తితో ప్రేమలో పడి, వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. 

ఢిల్లీలో దారుణం.. స్క్రాప్ దొంగిలించాడనే అనుమానం వ్యక్తిని కొట్టి చంపారు..

ఈ విషయం ఊర్లో తెలిసింది. కుటుంబం గురించి చెడుగామాట్లాడడం మొదలుపెట్టారు. పరువు పోయింది. పిల్లలను చూసి సూటి, పోటీ మాటలనడం మొదలుపెట్టారు. దీంతో టీనేజ్ లో ఉన్న ఇద్దరు పిల్లలు దాన్ని భరించలేకపోయారు. అప్పటికే కూతురు పెళ్లి అయిపోయింది. అయితే, తల్లి చేసిన పని తెలిపి అత్తింటివారు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. ఆ మాటలు భరించలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో జరిగింది. ఝాన్సీకి చెందిన ఉషారాణి అనే మహిళ భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఉషారాణి కూలీపనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించింది. కూతురి పెళ్లి చేసింది. కొడుకు ఇంకా చదువుకుంటున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం పరిచయం అయిన ఓ యువకుడితో ప్రేమలోపడి వివాహేతర సంబంధం పెట్టుకుంది. పెళ్లి చేసుకోవాలనుకుంది. 

ఈ విషయం తెలిసిన ఊరివారు కుటుంబాన్ని సూటిపోటీ మాటలతో వేధించడంతో భరించలేక కొడుకు విషం తాగి శుక్రవారం చనిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వార్త తెలిసిన ఆమె కన్నీరుమున్నీరవుతోంది. 

click me!