"కేవ‌లం చట్టాలతో దళితుల జీవితాలు మార‌వు.. మనం ఆలోచనా ధోరణి కూడా మారాలి

Published : Oct 10, 2022, 04:51 PM IST
"కేవ‌లం చట్టాలతో దళితుల జీవితాలు మార‌వు.. మనం ఆలోచనా ధోరణి కూడా మారాలి

సారాంశం

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్: దళితుల జీవితాలను చట్టం ద్వారా మాత్రమే మార్చలేమని, మ‌న‌ మనసు, మ‌న ఆలోచ‌న విధానంలో మార్పు రావాల‌న్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా కాన్పూర్‌లోని నానారావ్ పార్క్‌లో వాల్మీకి సమాజ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ అన్నారు.  

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్: కేవ‌లం దళితులకు కేటాయింపులు చేస్తే సరిపోదని, సమాజంలో వారి పట్ల ఆలోచనా ధోరణి మారాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. వాల్మీకి సంఘం వెనుకబడి ఉందని, వారిలో చైత‌న్యం రావాల‌ని అన్నారు. 

వాల్మీకి జయంతి సంద‌ర్బంగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. వాల్మీకి సంఘం ఇంకా చాలా బలహీనంగా ఉందని, వెనుకబడే ఉందని అన్నారు, వాల్మీకి మహర్షి లేకుండా శ్రీరాముడిని ఊహించలేమని అన్నారు. మొత్తం హిందూ సమాజంలో ఆయన కీర్తిస్తోందని అన్నారు. సమాజంలోని ప్రజలు శాఖలో చేరి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలతో స్నేహం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత మరో 10 నుంచి 30 ఏళ్లలో ప్రపంచం మొత్తం వాల్మీకి జయంతి జ‌రుపుకుంటుంద‌ని అన్నారు.  

ద‌ళితుల‌కు హక్కులు కల్పించ‌డం వ‌ల్ల‌ మార్పు రాదని, మ‌న‌ హృదయం, మనస్సు కూడా మారాలని అన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చే సమయంలో డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ చట్టపరంగా సమానమని, వెనుకబడిన వారు కూడా ఇతరులతో కలిసి కూర్చుంటారని ఇలాంటి వ్యాఖ్యాలు చేశార‌ని అన్నారు. చట్టాన్ని ఏర్పాటు చేయడం వల్ల అన్నింటికీ పనికి రాదని, మనసు, మనసు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చట్టం రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛను  అందించిందని అన్నారు.
 
సామాజిక స్వాతంత్య్రం వచ్చే వరకు కుల వ్యవస్థ అంతం కాదన్నారు. నాగ్‌పూర్‌లో తొలి వాల్మీకి ఆలయాన్ని ప్రారంభించామని, తాను అక్కడికి వెళ్లానని భగవత్ చెప్పారు. అలాగే వర్ణ కుల వ్యవస్థ అనే భావనను విస్మరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సంఘ్ శాఖల్లో చేరాలని ఆయన సంఘ సభ్యులకు పిలుపునిచ్చారు.

PREV
click me!

Recommended Stories

Lockdown : మళ్లీ ఇండియాలో లాక్ డౌన్ విధిస్తారా..? ఆల్ పార్టీ మీటింగ్ లో కేంద్రం క్లారిటీ
Iran-Israel Tensions: పాపం పాకిస్తాన్ జనం.. లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా? | Asianet News Telugu