కారణమిదీ: హీరో ప్రభాస్ సహా ఆదిపురుష్ సినిమా యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Published : Oct 10, 2022, 04:18 PM ISTUpdated : Oct 10, 2022, 04:34 PM IST
కారణమిదీ: హీరో ప్రభాస్ సహా ఆదిపురుష్ సినిమా యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

సారాంశం

ఆదిపురుష్ సినిమా యూనట్ కు ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది,  ఓవర్గం మనోభావాలు దెబ్బతీశారని దాఖలు చేసిన పిల్ పై కోర్టు నోటీసులు జారీ చేసింది. 

న్యూఢిల్లీ:ఆదిపురుష్  సినిమా యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు నోటీసులు జారీ చేసింది. ఓ వర్గం మనోభావాలు గాయపర్చారని దాఖలైన పిల్ పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు  జారీ చేసింది.  సినిమా  యూనిట్ తో పాటు హీరో ప్రభాస్ కు కూడా నోటీసులు జారీ చేశారు.

ఆదిపురుష్ టీజర్ ను చిత్ర యూనిట్ ఇటీవలనే విడుదల చేసింది.అయితే ఈ టీజర్  ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.ఈ విషయమై చిత్ర యూనిట్ పై ట్రోల్స్  చేశారు. దర్శకుడిపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఓ వర్గం దేవుళ్లను తప్పుగా టీజర్ లో చూపారని న్యాయవాది రాజ్ గౌరవ్ పిటిషన్ దాఖలు చేశారు. టీజర్ లో ఓ వర్గం దేవుళ్లను అసమంజసమైన సరికాని విధంగా చిత్రీకరించారని ఆ పిటిషన్ లో గౌరవ్ చెప్పారు.  

రాముడిని క్రూరమైన ప్రతీకార రూపంగా చూపారని పిటిషనర్ అభిప్రాయపడ్డారు.  సాంప్రదాయ చిత్రపటానికి విరుద్దంగా రాముడిని చూపారన్నారు. రావణుడి పాత్ర  చాలా  భయంకరంగా ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని కూడా పిటిషనర్ కోరారు. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈసినిమా విడుదల చేయాలని సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సినిమాను  విడుదల చేయకుండా పూర్తిగా నిషేధించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఆది పురుష్ సినిమా యూనిట్ కు నోటీసులు జారీ చేసింది. 

ఓం రౌత్ దర్శకత్వం  వహించిన  ఈ సినిమా కు భూషన్ కుమార్, ఒం ప్రసాద్, సుతార్, రాజేష్  నాయర్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ,తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం