
తమిళనాడు తాజా ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నేత కీర్తనా సంపత్. తెలుగులో మాట్లాడుతూ తమిళనాడులో విజయం సాధించిన యువ రాజకీయ నాయకురాలు. ఎన్నికల్లో తెలుగులో ప్రచారం చేయడం ఆమెకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. తెలుగు తెలిసిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. సోషల్ మీడియాలో కీర్తన ప్రచార వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఎన్నికల సమయంలో ఆమె పేరు తమిళనాడు అంతటా వినిపించింది. తమిళనాడుకు చెందిన అమ్మాయి తెలుగులో ఎందుకు మాట్లాడింది? తెలుగుకు ఆమెకు ఉన్న అనుబంధం ఏమిటి?