న్యూఢిల్లీ ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

Published : Jul 12, 2023, 10:34 AM ISTUpdated : Jul 12, 2023, 10:48 AM IST
న్యూఢిల్లీ ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లో  అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న  ఫైరింజన్లు

సారాంశం

న్యూఢిల్లీలోని మాయాపురి ఫేజ్ 1లో  ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు  చేసుకుంది.  ఆటోమొబైల్ షోరూం లో  అగ్ని ప్రమాదం  చోటు చేసుకుంది.

 

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని  మాయాపురి  ఫేజ్  1 లో గల ఆటోమొబైల్  సర్వీస్ సెంటర్ లో బుధవారంనాడు ఉదయం  అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నాయి.

 ఈ ప్రమాదానికి గల కారణాల గురించి  అగ్ని మాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ప్రమాదం  కారణంగా  ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని  అధికారులు  చెబుతున్నారు.ఇవాళ ఉదయం  ఎనిమిది గంటల సమయంలో ఈ ప్రమాదం  జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.  

also read:హైద్రాబాద్ దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు: ఏడుగురికి గాయాలు

ఇదిలా ఉంటే  ఈ నెల  8వ తేదీన  ఢిల్లీలోని  గులాబీ  బాగ్ లో   గోడౌన్ లో  అగ్ని ప్రమాదం జరిగింది. ప్రతాప్ నగర్  మెట్రో స్టేషన్ సమీపంలోని గులాబీ బాగ్ లో  ఉదయం  తొమ్మిదిన్నర గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ నెల  3వ తేదీన  న్యూఢిల్లీలోని గీతా నగర్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా లో  అగ్ని ప్రమాదం  జరిగింది.  అంతకు ముందు  రోజు గీతానగర్ లోని  స్వీట్స్ షాపులో  అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  ఇద్దరిని  పోలీసులు రక్షించారు.  వీరిలో ఓ వృద్దురాలితో పాటు  మరొకరున్నారు.  

దేశ వ్యాప్తంగా  పలు రాష్ట్రాల్లో  అగ్ని ప్రమాదాలు ఇటీవల కాలంలో  ఎక్కువగా నమోదౌతున్నాయి. వ్యాపార సముదాయాల్లో సరైన  ఫైర్ సేఫ్టీ జాగ్రత్తు తీసుకోకపోవడం ప్రమాదాలకు  కారణంగా అధికారులు  చెబుతున్నారు.

తెలంగాణలోని హైద్రాబాద్ దోమలగూడలో  ఈ నెల  11న  గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో  ఇంట్లోని  ఏడుగురు  తీవ్రంగా గాయపడ్డారు. పిండివంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ఈ ప్రమాదం జరిగింది.  ఈ నెల  10న హైద్రాబాద్ బాలానగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో  అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్ మెంట్  ఐదో ఫ్లోర్ లో  అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ నెల రెండో తేదీన  సికింద్రాబాద్ ఓ హోటల్ లో  అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నెల  3వ తేదీన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ నేవీ క్యాంటిన్ వద్ద  అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఏడాది జూన్  30న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని  సాహితీ ఫార్మాలో అగ్నిప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు.


 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం