
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి మంటపంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 11 లో సీఎన్జీ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 1.50 గంటల ప్రాంతంలో ఇక్కడ మంటలు చెలరేగాయి. ఆ మంటపం కర్రలతో, పీవోపీలతో చేసి ఉండటంతో వేగంగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలకు సంబంధించిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కొన్ని మైళ్ల దూరం ఆకాశంలో దట్టమైన పొగ కనిపిస్తున్నది. ఈ ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు ఆ సైట్లో ఎవరూ లేరని తెలిసింది. ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయనకు ప్రథమ చికిత్స అందించినట్టు అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 1.50 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపు అదే సమయంలో ఫైర్ డిపార్ట్మెంట్కు కాల్ వచ్చింది. సుమారు 12 ఫైర్ ఇంజిన్లు స్పాట్కు వెళ్లాయి. మధ్యాహ్నం 3.30 గంటల కల్లా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.