నిరీక్షణ : ప్రియురాలికోసం 21 యేళ్లుగా ఎదురుచూపులు.. మతిస్థిమితం కోల్పోయి...

By AN TeluguFirst Published Aug 10, 2021, 10:08 AM IST
Highlights

ఆ సమయంలో కేరళకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తన తోబుట్టువులకు పెళ్లి అయ్యాక వివాహం చేసుకుందామని చెప్పి ఆమెను మూలక్కుడికి తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు కారులో వచ్చి బలవంతంగా యువతిని లాక్కెళ్లారు. ఎప్పటికైనా ఆమె తిరిగి వచ్చేస్తుందని నాగరాజన్ రోడ్డు పైపే ఉండేవాడు.

ఆర్కేనగర్ : తన ప్రియురాలు ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఎదురుచూస్తూ ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయాడు. ఇలా 21 యేళ్లుగా అక్కడే నిరీక్షిస్తున్న ఘటన పుదుకోట్టైలో చోటుచేసుకుంది. జిల్లాలోని నొన్నమరావతి సమీపం మూలక్కుడి గ్రామానికి చెందిన నాగరాజన్ (40) దాదాపు 21 యేళ్ల క్రితం కుటుంబాన్ని పోసించేందుకు కోయంబత్తూర్ కు వెళ్లి అక్కడున్న ఓ కిరాణా దుకాణంలో పనిచేశాడు. 

ఆ సమయంలో కేరళకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తన తోబుట్టువులకు పెళ్లి అయ్యాక వివాహం చేసుకుందామని చెప్పి ఆమెను మూలక్కుడికి తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు కారులో వచ్చి బలవంతంగా యువతిని లాక్కెళ్లారు. ఎప్పటికైనా ఆమె తిరిగి వచ్చేస్తుందని నాగరాజన్ రోడ్డు పైపే ఉండేవాడు.

ఈ క్రమంలో మతిస్థిమితం కాస్తా తప్పింది. తర్వాత కొన్ని రోజులకు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న రాతిబండమీద ఉండేవాడు. చిన్న గుడిసెలా ఏర్పాటు చేసుకున్నాడు. అతడికి తల్లి నాగాయి ఆహారం ఇచ్చి వెల్తుంటుంది. ఎవరితోనూ మాట్లాడకుండా అక్కడే నిరీక్షిస్తున్న నాగరాజన్ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చికిత్స కోసం అంబులెన్స్ లో అస్పత్రికి తరలించారు. 
 

click me!