ఏఐసీసీ చీఫ్ గా రేపు బాధ్యతలు చేపట్టనున్న ఖర్గే.. ఆయన ముందున్న సవాళ్లేంటీ..?

Published : Oct 25, 2022, 11:35 PM IST
ఏఐసీసీ చీఫ్ గా రేపు బాధ్యతలు చేపట్టనున్న ఖర్గే.. ఆయన ముందున్న సవాళ్లేంటీ..?

సారాంశం

కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే బుధవారం (అక్టోబర్ 26) అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఆయన తన సమీప ప్రత్యర్థి శశిథరూర్‌పై దాదాపు 6 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమం ఏర్పాటు  ఏఐసీసీ ప్రాంగణంలో సాగుతున్నాయి. బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమంలో సోనియాగాంధీ చేతుల మీదుగా ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేయడంతో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ చేసిన సేవలకు గాను.. ఆమెకు కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అనంతరం.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు  మల్లికార్జున్ ఖర్గేకు ఏఐసీసీ సెంట్రల్ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ సర్టిఫికెట్‌ను అందజేయనున్నారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో ఖర్గే .. తన పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీడబ్ల్యూసీ సభ్యులు,ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ లీడర్లు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చాలామంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.  

పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఖర్గే.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.అతనితో కాసేపు గడిపారు. బుధవారం ఉదయం.. ఖర్గే రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. అలాగే..మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్‌ల స్మారక చిహ్నాలను కూడా సందర్శిస్తారు.
 

24 ఏళ్ల తర్వాత గాంధేతర అధ్యక్షుడి ఎన్నిక

కర్ణాటక దళిత సామాజిక వర్గానికి చెందిన 80 ఏళ్ల ఖర్గే అక్టోబర్ 17న జరిగిన చారిత్రాత్మక ఎన్నికల్లో తన ప్రత్యర్థి థరూర్ (66)పై విజయం సాధించారు. 137 ఏళ్ల పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయడానికి ఖర్గే అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగ్గా రాణించాలనేది పెద్ద సవాల్. అలాగే.. రాజస్థాన్, కర్ణాటకలో పార్టీలో కొనసాగుతున్న టగ్ ఆఫ్ వార్ ఆ పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీని ఏకం చేయడం ఖర్గే ముందున్న అతి పెద్ద సవాల్. 

కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడిగా, ఆ తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఖర్గేకి, పార్టీ చారిత్రాత్మకంగా అధ్వాన్నంగా ఉన్న సమయంలో ప్రస్తుత బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేవలం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మాత్రమే అధికారంలో ఉంది. జార్ఖండ్‌లో కాంగ్రెస్ జూనియర్ భాగస్వామిగా ఉండటంతో అక్కడ పార్టీ అధికార పగ్గాలను చేపట్టింది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. గుజరాత్ ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదు.

గుల్బర్గా సిటీ కౌన్సిల్ చీఫ్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన మల్లికార్జున ఖర్గే రాష్ట్ర మంత్రిగా మరియు గుల్బర్గా (2009 మరియు 2014) నుండి లోక్‌సభ ఎంపీగా పనిచేశారు. ఆయన గుల్బర్గాలో  2019 లోక్‌సభ ఎన్నికలు మినహా పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. ఆ ఓటమి తర్వాతే సోనియాగాంధీ ఖర్గేను రాజ్యసభకు తీసుకొచ్చి 2021 ఫిబ్రవరిలో ప్రతిపక్ష నేతగా చేశారు. చివరిగా గాంధీయేతర కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేస్రీ 1998లో ఐదేళ్ల పదవీకాలానికి రెండేళ్ల తర్వాత ఆయనను అనాలోచితంగా తొలగించారు. మరి మల్లికార్జున ఖర్గే ఏ విధంగా వ్యవహరిస్తారో వేచి చూడాలి.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Stock Market Today: ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన గ్లోబల్ అప్‌డేట్స్ ఇవే !
Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan