మలయాళ నటుడి మృతి..  సీని, రాజకీయ ప్రముఖుల సంతాపం..

Published : Mar 27, 2023, 02:04 AM ISTUpdated : Mar 27, 2023, 02:14 AM IST
మలయాళ నటుడి మృతి..  సీని, రాజకీయ ప్రముఖుల సంతాపం..

సారాంశం

నటుడు ఇన్నోసెంట్ మృతి: మాజీ ఎంపీ, ప్రముఖ మలయాళ నటుడు ఇన్నోసెంట్ (75) కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. కరోనా ఇన్ఫెక్షన్‌తో మరణించారు. సీని, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుతున్నారు.  

మలయాళ నటుడు ఇన్నోసెంట్ మృతి: మాజీ ఎంపీ, ప్రముఖ మలయాళ నటుడు ఇన్నోసెంట్ కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (మార్చి 26) తుదిశ్వాస విడిచారు. ఆయనకు 75 ఏళ్లు. వార్తా సంస్థ ANI ప్రకారం.. కరోనా ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులు, బహుళ అవయవ వైఫల్యం , గుండెపోటు కారణంగా  నటుడు ఇన్నోసెంట్ మరణించినట్లు ఆసుపత్రి తెలిపింది. లోక్‌సభ మాజీ సభ్యుడు ఇన్నోసెంట్‌ మార్చి 3 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఇన్నోసెంట్‌కు 2012లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మూడేళ్ల తర్వాత, అతను ఆ వ్యాధిని అధిగమించానని ప్రకటించాడు. అలాగే.. క్యాన్సర్‌తో తన యుద్ధం గురించి తన పుస్తకం 'లాఫ్టర్ ఇన్ ది క్యాన్సర్ వార్డ్'లో రాశాడు.

మలయాళ నటుడు, లోక్‌సభ మాజీ ఎంపీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. "ఇన్నోసెంట్ తన ప్రత్యేకమైన నటనా శైలితో ప్రజల హృదయాలను కొల్లగొట్టాడు.  పబ్లిక్ ఫిగర్‌గా ప్రజల జీవితాలను హత్తుకున్నాడు. వారి సమస్యలను తెలుసుకున్నారు" అని సీఎం విజయన్ అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఇన్నోసెంట్ మృతికి సంతాపం తెలిపారు. అతను అద్భుతమైన, ప్రతిభావంతుడైన నటుడని అన్నారు. "క్యారెక్టర్ యాక్టర్, హాస్యనటుడు & ఒకప్పటి కేరళ ఎంపీ ఇన్నోసెంట్ 75 ఏళ్ల వయసులో కన్నుమూసినందుకు సంతాపం తెలియజేస్తున్నాను. అద్భుతమైన , ప్రతిభావంతుడైన నటుడే కాకుండా, అతను మంచి మనిషి, అతనితో సంభాషించడం ఆనందంగా ఉంది. లోక్‌సభలో RIP. ఓం శాంతి" అని థరూర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu