సూరత్ లో అగ్ని ప్రమాదం: 14 మంది మృతి

Published : May 24, 2019, 06:02 PM ISTUpdated : May 24, 2019, 06:09 PM IST
సూరత్ లో అగ్ని ప్రమాదం: 14 మంది మృతి

సారాంశం

 సూరత్‌లో  ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో చిక్కుకొని 14 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు వ్యాపించి ప్రమాదం చోటు చేసుకొంది.  


సూరత్: సూరత్‌లో  ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో చిక్కుకొని 14 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు వ్యాపించి ప్రమాదం చోటు చేసుకొంది.

ఈ ప్రమాదంలో చిక్కుకొన్న విద్యార్థులను రక్షించేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.  ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు.శుక్రవారం నాడు మధ్యాహ్నం కోచింగ్ సెంటర్ లో విద్యార్థులు క్లాసులు వింటున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భవనం టెర్రస్ పై నుండి పలువురు దూకారు.

ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడ్డారు. అగ్ని కీలకలను అదుపులోకి తెచ్చేందుకు 18 ఫైరింజన్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అగ్ని ప్రమాదానికి  గల కారణాలు ఏమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఈ భవనంలో ఇంకా విద్యార్థులు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భవనంలో చిక్కుకొన్న వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

JEE Main 2026 : అమ్మ త్యాగం చేసింది.. కొడుకులు చరిత్ర సృష్టించారు ! వైరల్ అవుతున్న ట్విన్స్ స్టోరీ
Bank Holidays : బ్యాంకులకు 4 రోజులు సెలవులు.. రేపట్నుంచే ప్రారంభం.. ఎందుకో తెలుసా?