మైసూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. టపాసుల పరిశ్రమలో చెలరేగిన మంటలు..

Published : Apr 19, 2023, 05:39 PM IST
మైసూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. టపాసుల పరిశ్రమలో చెలరేగిన మంటలు..

సారాంశం

కర్ణాటకలోని మైసూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైసూర్‌లోని హెబ్బల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ టపాసుల  పరిశ్రమలో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

కర్ణాటకలోని మైసూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైసూర్‌లోని హెబ్బల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ టపాసుల  పరిశ్రమలో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ కాసేపటికే పెద్ద ఎత్తున పేలుడు చోటుచేసుకుంది. దీంతో సమీపంలోని ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ  ప్రమాదంలో ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలుముకున్నాయి.

ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడనికి యత్నిస్తున్నారు. ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంటుంది. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి.

 

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో