
కర్ణాటకలోని మైసూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైసూర్లోని హెబ్బల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ టపాసుల పరిశ్రమలో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ కాసేపటికే పెద్ద ఎత్తున పేలుడు చోటుచేసుకుంది. దీంతో సమీపంలోని ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలుముకున్నాయి.
ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడనికి యత్నిస్తున్నారు. ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంటుంది. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి.