Maharashtra Politics: "త్వరలో షిండే ప్రభుత్వం పడిపోతుంది" ఆదిత్య థాకరే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : Jul 23, 2022, 08:18 PM IST
Maharashtra Politics: "త్వరలో షిండే ప్రభుత్వం పడిపోతుంది" ఆదిత్య థాకరే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సారాంశం

Maharashtra Politics: మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోతుందనీ, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలను  జ‌రుగుతాయ‌ని  ఆదిత్య థాకరే అన్నారు.  

Maharashtra Politics: మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలో పడిపోతుందని, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని శివసేన నాయకుడు ఆదిత్య థాకరే శనివారం పేర్కొన్నారు. శివ సంవద్ యాత్ర' ప్రచారంలో మూడవ రోజు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

త‌న తండ్రి ఉద్ద‌వ్ ఠాక్రే అనారోగ్యంతో ఉన్నప్పుడు.. తన తండ్రికి, అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ద్రోహం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు నేత‌లు ఒక్క‌ట‌య్యారని విమ‌ర్శించారు. షిండే నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలో పడిపోతుందనీ, మహారాష్ట్ర మధ్యంతర ఎన్నికలను ఎదుర్కొంటుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఇది పోరాడటానికి సమయం

గత మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో శివసేన మంత్రులకు నిధులు రాలేదని బుమ్రే చేసిన వాదనను కూడా ఆదిత్య ఠాక్రే తోసిపుచ్చారు. మరఠ్వాడా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కింద పైథాన్ ప్రాంతానికి మొదటి పథకం వచ్చిందని థాకరే చెప్పారు. భూమ్రేకు ఐదుసార్లు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. ఇంతమంది కోసం మనం ఏం చేశాం అని తలచుకుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి, కానీ ఇది ఏడ్చే సమయం కాదు, పోరాడాల్సిన సమయమ‌ని అన్నారు.

 'ఇద్దరు వ్యక్తుల పాలనలో ప్రభుత్వం'

గత పదిహేను రోజుల్లో రాష్ట్రం వర్షాలు కురిసిందని, చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, అయితే ప్రభుత్వాన్ని కేవలం ఇద్దరు వ్యక్తులు (ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్) ​​నడుపుతున్నారని శివసేన నాయకుడు ఆదిత్య థాకరే అన్నారు. త‌న తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు.. శివసేనను విభజించడానికి కుట్ర పన్నిన నలభై మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను "ద్రోహులు" అని ఆయన అన్నారు.

 అనంతరం అహ్మద్‌నగర్ జిల్లాలోని నెవాసాలో జరిగిన ర్యాలీలో ఆదిత్య ఠాక్రే శివసేన మిత్రపక్షం, ఎమ్మెల్యే శంకర్‌రావ్ గడఖ్‌పై ప్రశంసలు కురిపించారు. స్నేహితులుంటే గఢాఖ్ లాగా ఉండాలని అన్నారు. మీ స్వంత వారే మీకు ద్రోహం చేసి దేశద్రోహులుగా మారతారు.అతను ఇంకా మాట్లాడుతూ, "ఉద్ధవ్ జీతో కలిసి ఉండాలనే తన నిర్ణయంపై గడఖ్ నిలిచార‌నీ, ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా తన నిబద్ధతపై దృఢంగా ఉన్నాడని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్