మహా వికాస్ అఘాడీ నేతలకు షిండే ప్రభుత్వం ఝలక్ .. 25 మంది కీలక నేతల భద్రత తొలగింపు..

Published : Oct 29, 2022, 06:02 AM IST
మహా వికాస్ అఘాడీ నేతలకు షిండే ప్రభుత్వం ఝలక్ .. 25 మంది కీలక నేతల భద్రత తొలగింపు..

సారాంశం

మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతల భద్రతను  షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం తొలగించింది. మరోవైపు ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, దిలీప్ వాల్సే పాటిల్‌ల భద్రతను 'జెడ్' కేటగిరీ నుంచి 'వై-ప్లస్'కేటగిరీకి తగ్గించింది. 

మహారాష్ట్రలోని షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహా వికాస్ అఘాడీ కూటమికి చెందిన 25 మంది నేతల భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతల భద్రత కోసం మోహరించిన భద్రతా సిబ్బందిని షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం తొలగించింది. 

మహా వికాస్ అఘాడీ కూటమికి చెందిన 25 మంది నేతల భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు శుక్రవారం ప్రభుత్వం తెలిపింది.అదే సమయంలో, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే , అతని కుటుంబ సభ్యుల భద్రతను కొనసాగించారు. భద్రత కోల్పోయిన వారిలో పలువురు మాజీ కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ మరియు అతని కుమార్తె,  బారామతి లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలేతో సహా అతని కుటుంబానికి భద్రత కల్పించింది. అయితే.. జయంత్ పాటిల్, ఛగన్ భుజబల్, జైలులో ఉన్న అనిల్ దేశ్‌ముఖ్‌తో సహా మరికొందరు ఎన్సీపీ నాయకుల భద్రత ఉపసంహరించబడింది. పాటిల్, భుజ్‌బల్, దేశ్‌ముఖ్‌లు గతంలో హోం మంత్రులుగా ఉన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఆసక్తికరంగా..ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత కార్యదర్శి మిలింద్ నార్వేకర్‌కు 'వై-ప్లస్-కేటగిరీ భద్రత ఇవ్వబడింది. అలాగే.. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అజిత్ పవార్, దిలీప్ వాల్సే-పాటిల్‌లకు కూడా 'వై-ప్లస్-కేటగిరీ భద్రత ఇవ్వబడింది. మాజీ ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్‌కు 'వై' కేటగిరీ భద్రత కల్పించారు.

నవాబ్‌ మాలిక్‌, అనిల్‌ దేశ్‌ముఖ్‌, విజయ్‌ వాడెట్టివార్‌, బాలాసాహెబ్‌ థోరట్‌, నానా పటోలే, భాస్కర్‌ జాదవ్‌, సతేజ్‌ పాటిల్‌, ధంజయ్‌ ముండే, సునీల్‌ కేదారే, నరహరి జిర్వాల్‌, వరుణ్‌ సర్దేశాయ్‌ వంటి నాయకుల క్లాసిఫైడ్‌  భద్రతను తొలగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, ఈ నాయకులకు వారి ఇళ్ల వెలుపల లేదా ఎస్కార్ట్‌ల వెలుపల శాశ్వత పోలీసు రక్షణ కల్పించబడదు. వారి భద్రతపై తాజా అంచనా వేసిన తర్వాత తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు భద్రతా అధికారి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu