Kerala: 270 ఏళ్ల తర్వాత మహా ఘట్టం.. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మహా క్రతువు

Published : Jun 09, 2025, 02:09 PM IST
anantha padmanaba swami

సారాంశం

శ్రీ అనంత పద్మనాభ ఆలయంలో 270 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం, విశ్వక్సేన విగ్రహ పునఃప్రతిష్టతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

కేరళలోని (kerala) తిరువనంతపురంలోని ప్రసిద్ధ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దాదాపు 270 ఏళ్ల విరామం తర్వాత మహా కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయం ప్రాంగణంలో ఆధ్యాత్మిక శక్తిని అభివృద్ధి చేయడం, పవిత్రతను మరింత పెంచడం లక్ష్యంగా నిర్వహించిన ఈ విశిష్ట కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మూడు శిఖరాలపై కొత్త కలశాలను..

తాజాగా ముగిసిన పునరుద్ధరణ పనుల అనంతరం ఆలయంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా గర్భగుడి పైభాగంలో ఉన్న మూడు శిఖరాలపై కొత్త కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఈ విగ్రహం దాదాపు 300 ఏళ్ల పాతదిగా ఉండగా, "కటు సర్కార యోగం" అనే సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పదార్థాలతో తయారు చేశారు.

ఆదివారం ఉదయం 7.40 నుంచి 8.40 మధ్య శుభ ముహూర్తంలో ప్రధాన ఆచారాలు నిర్వహించారు. తొలుత తిరునాల్ రామ వర్మ, ఇతర రాజకుటుంబ సభ్యుల సమక్షంలో తంత్రులు తిరువాంబాడి ఆలయంలో అష్టబంధ కలశం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటలకు విశ్వక్సేన విగ్రహాన్ని గర్భగుడిలో పునఃప్రతిష్ఠించారు.

ఈ మహా కుంభాభిషేకం సందర్భంగా ఆలయ పరిసరాలు నారాయణ నామస్మరణతో మార్మోగాయి. భక్తులకు ఉత్తమ అనుభవం అందించేందుకు ఆలయ అధికారులు నాలుగు ప్రధాన ద్వారాలపై పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. గవర్నర్ అర్లేకర్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ వేడుకకు ముందు వారంలో ప్రసాద శుద్ధి, ధార, కలశ పూజలతో పాటు పలు సంప్రదాయ ఆచారాలు కొనసాగాయి. మళ్లీ శతాబ్దాల క్రితం వలే, ఈ ప్రాచీన ఆలయంలో జరిగిన ఆధ్యాత్మిక ఉత్సవం భక్తుల మనసులను మైమరిపించింది

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?