దొంగతనం చేశాడనే అనుమానంతో.. ప్రైవేట్ పార్ట్స్ లో తన్ని..!

By telugu news teamFirst Published Aug 30, 2021, 11:12 AM IST
Highlights

బస్సులో బ్యాటరీలు చోరీ చేశాడని ఆరోపిస్తూ.. ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. అతని ప్రైవేట్ పార్ట్స్ లో సైతం  కాలితో తన్నడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఓ వ్యక్తి పట్ల దారుణంగా ప్రవర్తించారు. రెండు రోజుల క్రితం.. దొంగనతం ఆరోపణలతో ఓ గిరిజన యువకుడిని ట్రక్కుకు కట్టేసి.. దారుణంగా కొట్టారు. ఈ సంఘటన మరవకముందే.. మరో వ్యక్తిపై కూడా ఇలాంటి దాడే జరగడం గమనార్హం.

బస్సులో బ్యాటరీలు చోరీ చేశాడని ఆరోపిస్తూ.. ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. అతని ప్రైవేట్ పార్ట్స్ లో సైతం  కాలితో తన్నడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బాధితుడు అసద్ అనే వ్యక్తిగా గుర్తించారు.

కాగా.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో... పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించారు. కాగా.. నిందితులు డానిష్, కుల్దీప్ లను ఇఫ్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Mohd Asad was assaulted brutally in Rewa by those who accused him of stealing bus batteries, main accused Danish and Kuldip arrested pic.twitter.com/DqSx5rHS0Z

— Anurag Dwary (@Anurag_Dwary)

 

కాగా.. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలవరపరిచింది. ఈ హింసాత్మక ఘటనపై పోలీసులు సైతం సీరియస్ అయ్యారు.  ఇదిలా ఉండగా.. సరిగ్గా రెండు రోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

దొంగతనం ఆరోపణలతో ఓ వ్యక్తిని ట్రక్కుకు కట్టేసి మరీ కొట్టారు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో తర్వత చనిపోయాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను గుర్తించగా.. వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు.  ఈ ఘటన మరవకముందే.. మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

click me!