దొంగతనం చేశాడనే అనుమానంతో.. ప్రైవేట్ పార్ట్స్ లో తన్ని..!

Published : Aug 30, 2021, 11:12 AM IST
దొంగతనం చేశాడనే అనుమానంతో.. ప్రైవేట్ పార్ట్స్ లో తన్ని..!

సారాంశం

బస్సులో బ్యాటరీలు చోరీ చేశాడని ఆరోపిస్తూ.. ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. అతని ప్రైవేట్ పార్ట్స్ లో సైతం  కాలితో తన్నడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఓ వ్యక్తి పట్ల దారుణంగా ప్రవర్తించారు. రెండు రోజుల క్రితం.. దొంగనతం ఆరోపణలతో ఓ గిరిజన యువకుడిని ట్రక్కుకు కట్టేసి.. దారుణంగా కొట్టారు. ఈ సంఘటన మరవకముందే.. మరో వ్యక్తిపై కూడా ఇలాంటి దాడే జరగడం గమనార్హం.

బస్సులో బ్యాటరీలు చోరీ చేశాడని ఆరోపిస్తూ.. ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. అతని ప్రైవేట్ పార్ట్స్ లో సైతం  కాలితో తన్నడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బాధితుడు అసద్ అనే వ్యక్తిగా గుర్తించారు.

కాగా.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో... పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించారు. కాగా.. నిందితులు డానిష్, కుల్దీప్ లను ఇఫ్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

కాగా.. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలవరపరిచింది. ఈ హింసాత్మక ఘటనపై పోలీసులు సైతం సీరియస్ అయ్యారు.  ఇదిలా ఉండగా.. సరిగ్గా రెండు రోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

దొంగతనం ఆరోపణలతో ఓ వ్యక్తిని ట్రక్కుకు కట్టేసి మరీ కొట్టారు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో తర్వత చనిపోయాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను గుర్తించగా.. వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు.  ఈ ఘటన మరవకముందే.. మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

PREV
click me!

Recommended Stories

జనన, మరణ నమోదు బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్.. కీల‌క మార్పులు ఇవే
ఇక ప‌ని అయిపోంది అనుకున్న స‌మ‌యంలో పీకే వండ‌ర్‌.. ప్ర‌శాంత్ కిశోర్ గెలుపు అస‌లు కార‌ణ‌లేంటి?