హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు పదేళ్ల జైలుశిక్ష

By Mahesh RajamoniFirst Published Jan 11, 2023, 6:32 PM IST
Highlights

Lakshadweep: హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ పార్ల‌మెంట్ స‌భ్యులు మహ్మద్ ఫైజల్‌కు పదేళ్ల జైలు శిక్ష ప‌డింది. ఫైజల్ తో పాటు మ‌రో నలుగురికి లక్షద్వీప్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధ‌వారం తీర్పును ఇచ్చింది. 
 

Lakshadweep MP Mohammed Faizal: హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌తో సహా నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ లక్షద్వీప్‌లోని కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2009లో నమోదైన హత్యాయత్నం కేసులో దోషులకు కవరత్తిలోని జిల్లా-సెషన్స్ కోర్టు ఒక్కొక్కరికి ₹1 లక్ష జరిమానా విధించిందని కేసుకు సంబంధించిన న్యాయవాదులు తెలిపారు. న్యాయవాదుల ప్రకారం, 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయ సమస్యపై జోక్యం చేసుకున్నందుకు తమ పొరుగు ప్రాంతానికి చేరుకున్న కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్ అల్లుడు పదనాథ్ సలీహ్‌పై ఎంపీ-ఇతరులు దాడి చేశారు. అయితే,  మ‌హ్మ‌ద్ ఫైజల్ మాట్లాడుతూ.. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అనీ, త్వరలో ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తానని తెలిపిన‌ట్టు పీటీఐ నివేదించింది.

 

Four people, including Lakshadweep MP Mohammed Faizal get 10-yr-jail term in an attempt to murder case

— Press Trust of India (@PTI_News)

వివ‌రాల్లోకెళ్తే.. హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ ఫైజల్ సహా నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ లక్షద్వీప్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. కవరత్తిలోని జిల్లా-సెషన్స్ కోర్టు 2009లో వారిపై నమోదైన హత్యాయత్నం కేసులో దోషులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించింది. ఎంపీ ఫైజ‌ల్, ఇతరులు కేంద్ర మాజీ మంత్రి  పీఎం. సయీద్ అల్లుడుపదనాథ్ సలీహ్‌పై 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయ సమస్యపై దాడి జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే మహ్మద్ ఫైజల్‌, ఆయ‌న అనుచ‌రుల‌పై కేసు నమోదైంది. 

 

Adding full name of Lakshadweep MP:

It is a 'politically-motivated' case, will file an appeal in higher court: Mohammed Faizal after he gets 10 years jail in an attempt to murder case.

— Press Trust of India (@PTI_News)

ఎంపీ మహ్మద్ ఫైజల్ ఎవరు? 

మహ్మద్ ఫైజల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మహ్మద్ ఫైజల్ తొలిసారిగా 2014లో కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ నుండి లోక్‌సభ ఎంపీగా 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. అతను 2014-2016 కాలంలో రవాణా, పర్యాటకం-సంస్కృతిపై స్టాండింగ్ కమిటీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు కూడా. 

2019లో మహ్మద్ ఫైజల్ మళ్లీ ఎంపీగా ఎన్నికయ్యారు 

మే 2019లో, మొహమ్మద్ ఫైజల్ 17వ లోక్‌సభకు పార్లమెంటు సభ్యునిగా తిరిగి ఎన్నికయ్యారు. అతను పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు. ఇది కాకుండా, 13 సెప్టెంబర్ 2019 న, అతను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క కన్సల్టేటివ్ కమిటీలో సభ్యుడు కూడా అయ్యాడు. మహ్మద్ ఫైజల్ 28 మే 1975న జన్మించాడు.

click me!