
కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఇండోర్కు చెందిన మోని భోసలే (మోనాలిసా) తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్తో కలిసి కేరళలోని తిరువనంతపురం తంపానూర్ పోలీస్ స్టేషన్లో ఆశ్రయం కోరింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన వీరి ప్రేమను కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఇద్దరూ కేరళకు వచ్చి పోలీసుల సహాయం కోరినట్లు సమాచారం. కేరళలోని తిరువనంతపురం జిల్లా పూవార్లో ఉన్న నయనార్ ఆలయంలో మోనాలిసా భోస్లే మరియు ఫుర్మాన్ ఖాన్ వివాహం జరిగింది.