రాహుల్ గాంధీపై అనుచిత వీడియో.. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ పై ఎఫ్ఐఆర్ న‌మోదు

Published : Jun 28, 2023, 02:47 PM IST
రాహుల్ గాంధీపై అనుచిత వీడియో.. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ పై ఎఫ్ఐఆర్ న‌మోదు

సారాంశం

Bengaluru: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వివాదాస్ప‌ద యానిమేటెడ్ వీడియోను ట్వీట్ చేసినందుకు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై కాంగ్రెస్ సభ్యుడు రమేష్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మాలవీయపై బెంగళూరులో ఐపీసీ 153ఏ 120బీ 505(2), 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.  

BJP IT Cell chief Amit Malviya booked: కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీపై అనుచిత పోస్టులు పెట్టారంటూ బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవీయపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీసులు అతనిపై ఐపీసీ 153ఏ 120బీ 505(2), 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ నేత రమేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ యానిమేటెడ్ వీడియోను విడుదల చేసి, కాంగ్రెస్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ స‌ద‌రు వీడియోలో పేర్కొన్నార‌ని ఈ ఫిర్యాదులో ప్రస్తావించారు. 

జూన్ 17న తన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి రాహుల్ గాంధీకి సంబంధించిన యానిమేటెడ్ వీడియోను మాలవీయ పోస్ట్ చేశారు. 'రాహుల్ గాంధీ ప్రమాదకరమైన వ్యక్తి, మోసపూరిత ఆట ఆడుతున్నాడు..' అనే క్యాప్షన్ తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అందులో భారతదేశాన్ని విదేశాల్లో అపఖ్యాతి పాలు చేయడానికి, కేవలం ప్రధాని నరేంద్ర మోడీని ఇబ్బంది పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడరని పలు అంశాల‌ను ప్ర‌స్తావించారు. అమిత్ మాలవీయపై ఎఫ్ఐఆర్ పై స్పందించిన రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే, 'బీజేపీకి చట్టం దెబ్బ తగిలినప్పుడల్లా వారు ఏడుస్తారు. దేశ చట్టాలను పాటించడంలో వారికి సమస్య ఉంది. దురుద్దేశంతో ఎఫ్ఐఆర్ లో ఏ భాగాన్ని నమోదు చేశారో బీజేపీని అడగాలనుకుంటున్నాను. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

''అమిత్ మాలవీయ జూన్ 17న తన అధికారిక ఖాతా నుంచి యానిమేటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ఈ వీడియో చూపిస్తుంది' అని ఆర్డీపీఆర్, ఐటీ, బీటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వివరించారు.

 

 

''బీజేపీ పార్టీ నడుపుతున్న అబద్ధాల కర్మాగారాన్ని మూసివేయాలని నిర్ణయించామన్నారు. ఇక్కడ తమ ప్రభుత్వమే కాబట్టి తప్పించుకోగలిగారు. అప్పుడు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ను మూసివేశారు. బీజేపీ పార్టీ కార్యకర్తలే ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అలా జరగనివ్వం. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ను బలోపేతం చేస్తాం. ఇప్పటికే సీఎంతో మాట్లాడాను. మతపరమైన, శాంతికి విఘాతం కలిగించే పోస్టులపై చర్యలు తీసుకుంటామని'' ప్రియాంక్ తెలిపారు. అలాగే, ''వారు (బీజేపీ) ఎల్లప్పుడూ దుర్మార్గమైన సందేశాలను పోస్ట్ చేస్తారు.. విద్వేష బీజాలను నాటుతారు.. భయాన్ని సృష్టిస్తారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న జేపీ నడ్డా, అమిత్ మాలవీయ, సూద్ వంటి వారు తమ ఖాతాల నుంచి అబద్ధాలు చెబుతుంటే చూస్తూ ఊరుకోలేం. వారు ఆరోపణలను రుజువు చేయాల్సి ఉంటుందని' అన్నారు. అమిత్ మాలవీయ బెంగళూరుకు వచ్చి కాంగ్రెస్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఎలా పాల్పడిందో వివరించాలన్నారు. లేనిపక్షంలో క్షమాపణలు కోరాలని, భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు చేయబోనని లేఖ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu