కర్నాటకలో ఎలక్షన్ పాలిటిక్స్ షురు.. కాంగ్రెస్ పై సీఎం బొమ్మై ఘాటు వ్యాఖ్యలు..

Published : Apr 18, 2022, 11:02 AM IST
కర్నాటకలో ఎలక్షన్ పాలిటిక్స్ షురు.. కాంగ్రెస్ పై సీఎం బొమ్మై ఘాటు వ్యాఖ్యలు..

సారాంశం

Karnataka: కర్నాటకలో మరోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది. వచ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం ప్రారంభించింది. ఈ క్రమంలోనే సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై కాంగ్రెస్ పై విమ‌ర్శ‌ల దాడి కొనసాగించారు.   

Karnataka Assembly elections:  క‌ర్నాట‌క‌లో ఎన్నిక‌ల రాజ‌కీయాలు షురు అయ్యాయి. మ‌రోసారి అధికారం ద‌క్కించుకోవాల‌ని అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజీపీ) చూస్తోంది. బీజేపీకి గ‌ట్టి షాక్ ఇవ్వాల‌ని కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. వ‌చ్చే ఏడాది (2023) క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై కాంగ్రెస్ పై విమ‌ర్శ‌ల దాడి కొనసాస్తూ.. ఎన్నిక‌ల రాజ‌కీయానికి తెర‌లేపారు. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదంటూ ఘాటు వ్యాఖ్యలతో మండిప‌డ్డారు. ‘‘గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2జీ, 3జీ, రక్షణ, బొగ్గు కుంభకోణాలకు పాల్పడి చెడ్డపేరు తెచ్చుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కొనుగోళ్లలో కుంభకోణాలకు పాల్పడడం ద్వారా దేశ భద్రతతో కూడా ముప్పులో ప‌డేసేవిధంగా రాజీ పడింది” అని సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారం, ఓటు బ్యాంకు గురించి మాత్రమే ఆందోళన చెందుతుంద‌ని విమ‌ర్శించారు. 

కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్ర‌భుత్వాలు ప్ర‌జానుకూల మెరుగైన పాలన అందిస్తున్న‌ద‌ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సుపరిపాలన కోసం రైతులు, మహిళలు మరియు బలహీనవర్గాల నుండి పార్టీ సానుకూల మ‌ద్ద‌తు కోరుకుంటుందని అన్నారు. విజయనగరం పుణ్యభూమి అని, న్యాయం, సానుకూల ప్రజాస్వామ్య విలువల ఆధారంగా బీజేపీ ప్రజాస్వామిక యుద్ధాన్ని ప్రకటించిందని అన్నారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఆయన సంక్షేమ కార్యక్రమాల సమర్ధవంతమైన నాయకత్వంలో మనం ముందుకు సాగుదాం. కలిసికట్టుగా ఉద్యమిద్దాం, విజయం మనదే అవుతుంది'' అని అన్నారు. “మా సుపరిపాలన, శాంతిభద్రతలను అమలు చేయడం, రాష్ట్రం మరియు దేశం ఐక్యత, స‌మగ్రతను కాపాడుకోవడం కోసం మేము రైతులు, మహిళలు మరియు బలహీన వర్గాల నుండి సానుకూల ఆదేశాన్ని కోరుతాము. పనితీరు నివేదిక కార్డుతో ప్రజల్లోకి వెళ్లి ప్రజల మనసు దోచుకుంటాం. జ‌ర‌గ‌బోయే 2023 అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల హృదయాలలో కమలం వికసించేలా చేద్దాం ”అని బ‌స‌వ‌రాజ్‌ బొమ్మై అన్నారు. 

కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప‌నితీరును యావ‌త్ ప్ర‌పంచం కొనియాడుతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు.  న‌రేంద్ర మోడీ నాయకత్వమే పార్టీకి గొప్ప బలమని, ప్రపంచం మొత్తం ఆయనను గొప్ప నాయకుడిగా అంగీకరించిందని చెప్పారు. రాష్ట్రానికి, దేశానికి ఉజ్వల భవిష్యత్తును రూపొందించేందుకు ఆయన నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని బ‌స‌వ‌రాజ్‌ బొమ్మై  పిలుపునిచ్చారు. మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డానికి పార్టీ శ్రేణులు ముందుకు క‌ద‌లాల‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక కుంభ‌కోణ‌లు జ‌రిగాయ‌ని అన్నారు. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని బ‌స‌వ‌రాజ్‌ బొమ్మై మండిపడ్డారు. రాష్ట్రంలో మత ఉద్రిక్తతలకు కారణమయ్యే అధికారం, ఓటు బ్యాంకు రాజకీయాల గురించి మాత్రమే కాంగ్రెస్ ఆందోళన చెందుతోందని ఆరోపించారు. “అధికారంలో ఉన్నప్పుడు దేశ వ్యతిరేక అంశాలను ప్రోత్సహిస్తూ వారు పరిపాలనపై నియంత్రణ కోల్పోయారు. డిజె హళ్లి పోలీస్ స్టేషన్‌పై అల్లర్లు దాడి చేసి తమ సొంత పార్టీ ఎమ్మెల్యే నివాసాన్ని తగలబెట్టినప్పుడు వారు మూగ ప్రేక్షకులుగా మిగిలిపోయారు” అని ఆయన అన్నారు.

"వారు (కాంగ్రెస్‌) సమాజంలో శాంతి మరియు సామరస్యాన్ని కోరుకోరు. వారి ఓటు బ్యాంకు రాజకీయాలు విధ్వంసకర అంశాలను మరింత బలపరిచాయి, హుబ్బళ్లిలో పోలీస్ స్టేషన్‌పై దాడి మరియు హిజాబ్ సమస్యపై వారి వైఖరి గురించి కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండటాన్ని బొమ్మై ప్రశ్నించారు. కాగా, క‌ర్నాట‌క‌లో  2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం