
హిమాచల్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మండి జిల్లాలోని పధార్ వద్ద ప్రయాణికులతో వెళుతున్న జీపు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఐదుగురు దుర్మరణం పాలవ్వగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.