జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల: టాప్-20లో తెలుగు విద్యార్ధులు

Siva Kodati |  
Published : Jun 14, 2019, 02:52 PM IST
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల: టాప్-20లో తెలుగు విద్యార్ధులు

సారాంశం

శుక్రవారం విడుదలైన ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్ధులు ర్యాంకుల పంట పండించారు. టాప్-20లో ఐదుగురు హైదరాబాద్ విద్యార్ధులు ర్యాంకులు సాధించారు. 

శుక్రవారం విడుదలైన ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్ధులు ర్యాంకుల పంట పండించారు. టాప్-20లో ఐదుగురు హైదరాబాద్ విద్యార్ధులు ర్యాంకులు సాధించారు.

ఆకాశ్ రెడ్డి -4, బి. కార్తికేయ-5, ఎం.త్రివేశ్ చంద్ర-8, జీవీ కృష్ణ సూర్య లిఖిత్ 13, సూరపనేని సాయివిజ్ఞకు 44, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో డి.చంద్రశేఖర్ మొదటి ర్యాంక్ సాధించారు. దేశవ్యాప్తంగా 1.65 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యారు.

ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 13, 267 మంది విద్యార్ధులు, తెలంగాణ నుంచి  16,886 మంది విద్యార్ధులు పరీక్ష రాశారు. జేఈఈ  అడ్వాన్స్‌డ్  ఫలితాల ఆధారంగా ప్రతిష్టాత్మక ఐఐటీలలో ప్రవేశాలు కల్పించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu