జయలలిత మృతి కేసు..విచారణ నిలిపివేత

Published : Apr 26, 2019, 12:48 PM IST
జయలలిత మృతి కేసు..విచారణ  నిలిపివేత

సారాంశం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మృతి కేసు దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మృతి కేసు దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 5, 2016లో జయలలిత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె చనిపోయిన నాటి నుంచి కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

తాజాగా  హాస్పటిల్ రికార్డు ఇవ్వాల్సిందిగా అధికారులు హాస్పిటల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దీంతో.. దీనిపై అపోలో హాస్పిటల్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. అక్కడ హాస్పిటల్ యజమాన్యం పెట్టుకున్న పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది.

దీంతో.. వారు ఈ సారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని న్యాయస్థానం.. హాస్పిటల్ పెట్టుకున్న పిటిషన్ ని పరిశీలించింది. అనంతరం దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

Illegal Liquor: సీజ్ చేసిన మద్యాన్నిగుజరాత్ పోలీస్ లు ఏం చేస్తున్నారో చూడండి | Asianet News Telugu
NEET Exam Paper Leak: నీట్ రీ-ఎగ్జామ్ పేప‌ర్ మ‌ళ్లీ లీక్ అయ్యిందా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం