లోయ‌ను ఖాళీ చేయాలంటూ కాశ్మీరీ పండిట్ల‌కు బెదిరింపు లేఖ‌లు.. 1990 నాటి ప‌రిస్థితుల మ‌ధ్య భ‌యాందోళ‌న‌లు

Published : Apr 15, 2022, 02:51 PM ISTUpdated : Apr 15, 2022, 02:56 PM IST
లోయ‌ను ఖాళీ చేయాలంటూ కాశ్మీరీ పండిట్ల‌కు బెదిరింపు లేఖ‌లు.. 1990 నాటి ప‌రిస్థితుల మ‌ధ్య భ‌యాందోళ‌న‌లు

సారాంశం

Kashmiris Pandits: లోయ‌ను ఖాళీ చేయాలంటూ కాశ్మీరీ పండిట్ల‌కు బెదిరింపు లేఖ‌లు వ‌చ్చాయి. దీంతో 1990 నాటి ప‌రిస్థితులను గుర్తుచేసుకుంటూ జ‌మ్మూకాశ్మీర్ లోని హిందువులు భ‌యాందోళ‌నకు గుర‌వుతున్నారు. త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని అధికారులను కోరుతున్నారు.   

Kashmiri Hindus: కశ్మీర్ లోని బారాముల్లాలో నివసిస్తున్న కాశ్మీరీ పండిట్లకు మరోసారి బెదిరింపు లేఖలు అందాయి. వారికి అందిన ఈ బెదిరింపు లేఖలు 1990 నాటి భయాల‌ను తిరిగి తీసుకువచ్చాయి. అప్ప‌ట్లో  అనేక మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు, ఇస్లాం మతంలోకి మారాలని, జమ్మూ కాశ్మీర్ ను విడిచిపెట్టాలని  ఆ బెరింపు లేఖ‌ల్లో పేర్కొన్నారు. లేకుంటే ప్రాణాలు కోల్పోవ‌డం త‌ప్ప‌దంటూ హెచ్చ‌రించారు. వారిపై దాడులు జ‌రిగాయి. ఎంతో మంది కాశ్మీరీ పండిట్లు జ‌మ్మూకాశ్మీర్ ను వ‌దిలిపెట్టారు. ఇప్ప‌టికీ ఆనాటి ప‌రిస్థితుల‌ను గుర్తుచేసుకుంటూ వారు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

మ‌రోసారి అలాంటి బెదిరింపులు లేఖ‌లు రావ‌డం లోయ‌లో క‌ల‌క‌లం రేపుతోంది. ఈసారి కశ్మీరీ పండిట్లకు స్థానిక ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-ఇస్లాం బెదిరింపు లేఖలు జారీ చేసింది. బెదిరింపు లేఖల కాపీలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయ‌బ‌డ్డాయి. లష్కర్-ఎ-ఇస్లాం జారీ చేసిన ఈ బెదిరింపు లేఖలు హవాల్ లోని వలసదారుల శిబిరం, బారాముల్లాలోని వలస శిబిరానికి అధ్యక్షుడికి పంప‌బ‌డ్డాయి. " కశ్మీరీ పండిట్లను వెంటనే కశ్మీర్ విడిచి వెళ్లాలని మేము ఆదేశిస్తున్నాము.. లేకపోతే మీ కుటుంబమంతా నష్టపోతుంది.. - మేము మిమ్మల్ని భయపెట్టడం లేదు.. కానీ ఈ భూమి ముస్లింలకు మరియు ఇస్లాంను అంగీకరించేవారికి మాత్రమే.. ఇది అల్లా భూమి..ఇక్క‌డ  హిందువులు వుండ‌లేరు చేయలేరు"  అంటూ ఆ లేఖ‌లో పేర్కొన్నారు. “మా సహోదరులు 1990లో పట్టించుకోని.. చూడ‌ని వాటికి హాజరుకాబోతున్నారు” అనే హెచ్చరికతో ఆ బెదిరింపు లేఖ ముగిసింది. ఈ బెదిరింపు లేఖ‌లు కాశ్మీరీ పండిట్ల హృదయాలలో మరోసారి భయాన్ని కలిగించాయి.  తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన వారు స్థానికంగా ఉన్న వారితో పాటు అధికారులను త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతున్నారు. 

ఈ బెదిరింపు లేఖ‌ల‌కు ముందు జ‌మ్మూకాశ్మీర్ లో చోటుచేసుకున్న ప‌లు ఘ‌ట‌న‌లు అక్క‌డి హిందువుల్లో భ‌యాందోళ‌న‌లు పెంచాయి. ఏప్రిల్ 13న‌.. పొంబే కక్రాన్ గ్రామానికి చెందిన స్థానిక రాజ్‌పుత్ సతీష్ సింగ్‌ను కాల్చిచంపడం కాశ్మీర్ లోయలో నివసిస్తున్న మొత్తం మైనారిటీ వర్గానికి వణుకు పుట్టించింది. అంతకుముందు ఏప్రిల్ 4న..  షోపియాన్ జిల్లాలోని ఛోటిగామ్‌లో మెడిసిన్ దుకాణం నడుపుతున్న బాల్ క్రిషన్ భట్ ను.. అత‌ని దుకాణం వెలుపల ఉగ్రవాదులు కాల్పులు జ‌రిపారు. షోపియాన్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి దాదాపు 10 కి.మీ.. శ్రీనగర్ నుండి 70 కి.మీ దూరంలో ఉన్న చోటిగామ్‌లోని రెండు కాశ్మీరీ పండిట్ కుటుంబాలలో భట్ కుటుంబం ఒకటి. శ్రీనగర్‌లోని ఆర్మీకి చెందిన 92-బేస్ హాస్పిటల్‌లో చేరిన తర్వాత భట్ పరిస్థితి నిలకడగా ఉండ‌గా.. నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'  దాడికి బాధ్యత వహించింది. ఈ ఘటన తర్వాత, కశ్మీరీ పండిట్ మారణహోమంపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

కాశ్మీర్ లోయలో నిరంతరం భయం, వారి ప్రాణాలకు తీవ్ర ముప్పుపొంచివున్న నీడలో నివసిస్తున్న మైనారిటీలకు సహాయం చేయాలని J&K పీస్ ఫోరమ్ చైర్మన్ సతీష్ మహల్దార్ అధికారులకు, కాశ్మీర్‌లోని మెజారిటీ జనాభాకు విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ ప్రాంతంలోని మైనారిటీల ఉనికిని మరియు జాతి, సాంస్కృతిక, మత మరియు భాషా గుర్తింపును కాపాడేందుకు మరియు ఆ గుర్తింపును ప్రోత్సహించడానికి పరిస్థితులను ప్రోత్సహించడానికి మెజారిటీ జనాభా ముందుకు రావాలని ఆయన కోరారు.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం