కుక్కలు కరుస్తున్నాయంటూ 58,869 ఫిర్యాదులు.. !? ఎక్కడంటే...

Published : Jan 19, 2021, 12:21 PM IST
కుక్కలు కరుస్తున్నాయంటూ 58,869 ఫిర్యాదులు.. !? ఎక్కడంటే...

సారాంశం

దేశంలో ఒక ప్రాంతం నుంచి కుక్కలు కరుస్తున్నాయంటూ 58,869 ఫిర్యాదులు అందడం విస్మయం కలిగిస్తుంది. పదేళ్ల కాలంలో ఒకే ప్రాంతం నుంచి ఇన్ని ఫిర్యాదులు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది మనదేశంలోని కశ్మీర్ ఘాటీలోని పరిస్థితి. 

దేశంలో ఒక ప్రాంతం నుంచి కుక్కలు కరుస్తున్నాయంటూ 58,869 ఫిర్యాదులు అందడం విస్మయం కలిగిస్తుంది. పదేళ్ల కాలంలో ఒకే ప్రాంతం నుంచి ఇన్ని ఫిర్యాదులు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది మనదేశంలోని కశ్మీర్ ఘాటీలోని పరిస్థితి. 

కశ్మీర్ ఘాటీలో కుక్కల దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడచిన పదేళ్లలో కుక్కలు కరుస్తున్నాయంటూ ఘాటీలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 58,869 ఫిర్యాదులు అందాయి. ఈ లెక్కన చూస్తే ప్రతీరోజు ఇటువంటి 16 ఫిర్యాదులు అందుతున్నాయి. 

రాష్ట్ర ఆరోగ్యశాఖ అందజేసిన వివరాల ప్రకారం 2011 జనవరి నుంచి 2021లో ఇప్పటివరకూ మొత్తం 58,868 మంది కుక్క కాటుకు గురయ్యాయి. కుక్క కాట్లకు సంబంధించి శ్రీనగర్‌లో అత్యధిక ఫిర్యాదులు అందాయి. 

రోజురోజుకు కుక్కల దాడులు పెరుగుతుండటంతో ప్రజలు వీధికుక్కలను చూడగానే వణికిపోతున్నారు. ఎస్ఎంహెచ్‌ఎస్ చికిత్సా విభాగం అధికారి డాక్టర్ సలీమ్ ఖాన్ మాట్లాడుతూ ప్రతీయేటా ఐదు నుంచి ఆరు వేలమంది కుక్క కాటు బాధితులు ఆసుపత్రులకు వస్తున్నారన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్